PGECET-LAWCET | వచ్చే 2025-26 విద్యా సంవత్సరానికి గానూ ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీతో పాటు లా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. పీజీఈసెట్, లాసెట్కు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి శుక్రవారం నాడు విడుదల చేసింది ఈ రెండు సెట్లకు సంబంధించిన అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.
లాసెట్ 2025కి సంబంధించి ఈ నెల 26వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆగస్టు 4వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లకు అవకాశం ఇవ్వనున్నారు. 16, 17వ తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇస్తారు. ఆగస్టు 22వ తేదీన సీట్లు కేటాయింపు జరుగుతుంది. అడ్మిషన్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 22 నుంచి 25వ తేదీలోపు ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
ఇక పీజీఈసెట్ 2025 అడ్మిషన్లకు సంబంధించి ఈ నెల 26వ తేదీన టిఫికేషన్ విడుదల కానుంది. ఆగస్టు 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లకు అవకాశం ఇవ్వనున్నారు. 11, 12వ తేదీల్లో మొదటి విడతగా వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నారు. ఆగస్టు 16వ తేదీన సీట్ల కేటాయింపు జరగనుంది. ఆగస్టు 18వ తేదీ నుంచి 21 వరకు ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.