హనుమకొండ రస్తా, జూన్ 26 : తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ సీపీజీఈటీ-2026 షెడ్యూల్ను కన్వీనర్ ఆచార రాజేందర్ కట్ల శుక్రవారం విడుదలచేశారు. జూలై 8 నుంచి 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాల్లో ప్రతిరోజూ మూడు సెషన్లలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.
పరీక్షల తేదీలు, సెషన్ల వారీ షెడ్యూల్ తదితర వివరాల కోసం కాకతీయ విశ్వవిద్యాలయం అధికారిక వెబ్ సైట్ www.kakatiya.ac.inలో పరిశీలించాలని సూచించారు.