TG EAPCET | హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన టీజీ ఎప్సెట్ ఫలితాలు ఆదివారం విడుదలకానున్నాయి. ఉదయం 11గంటలకు ఈ ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు విడుదల చే యనున్నారు. ఎప్సెట్ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం ప్రశ్న లు, సమాధానాలపై ఒక్క అభ్యంతరం రాకపోవడం గమనార్హం.
ఆరు సెషన్లలో నిర్వహించిన ఇంజినీరింగ్ విభాగం పరీక్షకు మాత్రం 16 అభ్యంతరాలు వ్యక్తం కాగా, వీటిని ని పుణుల కమిటీ తోసిపుచ్చింది. ఆయా అభ్యంతరాలను కొట్టిపారేసింది. శుక్రవారం నిర్వహించిన సెట్ కమిటీ సమావేశంలో ఎప్సెట్ ఫైనల్ కీని ఖరారు చేశారు. ఈ నెల 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, 9,10,11 తేదీల్లో ఇం జినీరింగ్ విభాగం పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు ముగిసిన 5 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం గమనార్హం.