తెలంగాణలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. సైఫాబాద్లోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయంలో ఫలితాలను పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ దేవసేన శుక్రవారం విడుదల చేశారు. విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం 79.82గా నమోదైంది. 48,167 మంది సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కాగా, 38,447 మంది ఉత్తీర్ణత సాధించారు.
బాలుర పాస్ పర్సంటేజ్ 78.42 శాతం, బాలికల పాస్ పర్సంటేజ్ 82.21 శాతంగా ఉంది. ఉత్తీర్ణతలో సిద్దిపేట జిల్లా 97.99 శాతంతో ప్రథమ స్థానంలో నిలువగా, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా 53.11 శాతంతో చివరిస్థానంలో నిలిచింది. ఈ నెల 3 నుంచి 12వ తేదీ వరకు రీకౌంటింగ్కు అవకాశం కల్పించారు. ఒక్కో సబ్జెక్ట్కు రూ. 500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.