హైదరాబాద్: వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సింగరేణి (Singareni) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 10 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ పోస్టులకు డిగ్రీ లేదా డిప్లొమా చేసినవారు అర్హులు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 177 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఈ ఉద్యోగాలను ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన అభ్యర్థులతో భర్తీ చేస్తారు.
మొత్తం ఖాళీలు: 177
అర్హతలు: డిగ్రీలో కంప్యూటర్స్లో లేదా డిప్లొమా చేసి ఉండాలి. అభ్యర్థులు 30 ఏండ్లలోపు వారై ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జులై 10
వెబ్సైట్: https://scclmines.com/