ఇతడు భారతీయుడు
రాసిన గ్రంథాలు : ఆర్యభట్టీయం, ఆర్యభట్ట సిద్ధాంతం.
ఆర్యభట్ట
ఇతడు భారతీయుడు
రాసిన గ్రంథాలు : ఆర్యభట్టీయం, ఆర్యభట్ట సిద్ధాంతం.
ఆర్యభట్ట సిద్ధాంతం: రోజువారీ ఖగోళ లెక్కలను గణించి, పూజా పునస్కారాలకు మంచి రోజులు నిర్ణయించడానికి ఒక గైడ్ లాంటిది. నేటి పంచాంగకర్తలకు ఇది ప్రముఖమైన గ్రంథం.
ఆర్యభట్టీయం : దీనిలో గణిత, ఖగోళ శాస్ర్తాలకు సంబంధించిన అనేక లెక్కలున్నాయి. ఇది 4 భాగాలుగా విభజింపబడి 121 శ్లోకాలను కలిగి ఉంది. ఈ నాలుగు భాగాలు గీతికా పాదం, గణిత పాదం, గోళ పాదం, కాల పాదం.
దీనిలో భూమి గుండ్రంగా ఉందని, అది అక్షం చుట్టూ గుండ్రంగా తిరుగుతుందని దీని వల్ల పగలు, రాత్రి ఏర్పడుతున్నాయని వివరించాడు.
భూభ్రమణం వల్ల పగలు రాత్రి ఏర్పడుతున్నాయని, భూమిపై ఒక భాగంలో పగలు ఉంటే, మరో భాగంలో రాత్రి ఉంటుందని వివరించాడు.
చంద్రుడిపై చీకటిగా ఉంటుందని, సూర్యకాంతి పడటం వల్లనే చంద్రుడు ప్రకాశిస్తున్నట్లు వివరించాడు.
సూర్య, చంద్ర గ్రహణాలు, భూమి, చంద్రుని నీడ వల్ల ఏర్పడతాయని భూకేంద్రక సిద్ధ్దాంతానికి ఊతం ఇచ్చాడు.
ఈ గ్రంథంలో వర్గ మూలాలను, ఘనమూలాలను కనుక్కునే పట్టికలను, త్రికోణమితీయ పట్టికలను, గ్రహమండల నమూనాకు దీర్ఘవృత్తాకార కక్ష్యలను సూచించాడు.
గామా విలువను 3.1416గా కచ్చితంగా కనుగొన్నాడు.
ఈ గ్రంథంలో దశాంశ పద్ధతి, దీర్ఘచతురస్ర, త్రిభుజ, వృత్త వైశాల్యాలను కనుగొనే పద్ధతులను వివరించాడు.
బీజ గణితం గురించి వివరించిన ఖ్యాతి, దాన్ని మొదటగా ఉపయోగించిన ఖ్యాతి ఆర్యభట్టదే.
సమీకరణాలను పల్వరైజర్ పద్ధతి ద్వారా సాధించే విధానం, అంక, గుణశ్రేఢులను, సైన్ పట్టికలను తెలియజేశాడు.
సి.వి.రామన్
Global Beacon Cv Raman
ఈయన భారతీయుడు.
కేవలం రూ.200 విలువ చేసే పరికరాలను ఉపయోగించి 1930లో ‘రామన్ ఎఫెక్ట్’ను కనుగొన్నాడు. ఇందుకు ఆయనకు నోబెల్ బహుమతి లభించింది.
పారదర్శకంగా ఉన్న ఘన/ద్రవ/వాయు మాధ్యమం గుండా కాంతిని ప్రసరింపచేసినపుడు అది దాని స్వభావాన్ని మార్చుకుంటుందనే దృగ్విషయాన్ని తెలిపేదే రామన్ ఎఫెక్ట్.
రామన్ ఎఫెక్ట్కు కారణం క్రాంప్టన్. క్రాంప్టన్కు 1927లో నోబెల్ బహుమతి వచ్చింది. క్రాంప్టన్ ఎఫెక్ట్ X కిరణాల విషయంలో నిజమైనపుడు అది కాంతి విషయంలో మాత్రం ఎందుకు నిజం కాదు అన్న ప్రశ్న రామన్ ఎఫెక్ట్ కనుగొనడానికి కారణం అయ్యింది.
సి.వి.రామన్ – వయోలిన్, సితార్ ఎలా సంగీతాన్ని పలికిస్తాయో అధ్యయనం చేశాడు.
రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణ వల్ల సుమారు 2,000 రసాయన పదార్థాల అంతర్గత నిర్మాణం, ఆ తర్వాత స్ఫటికాల నిర్మాణం తెలుసుకోవడం జరిగింది. స్పెక్టోగ్రఫీ గొప్ప శాస్త్రంగా అధ్యయనం చేస్తున్నారు.
ఇంకా ఫార్మాస్యూటికల్స్ బయాలజీ, పొల్యూషన్ స్టడీస్, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ విభాగాలు అంచనాలకు అందకుండా బహుముఖంగా విస్తరిస్తున్నాయి.
ఆయనకు1954లో దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ లభించింది.
సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్
Subrahmanyan Chandrasekhar
ఈయన భారత సంతతి అమెరికన్
సి.వి.రామన్ మేనల్లుడు
1983లో నోబెల్ బహుమతి గ్రహీత. (కృష్ణబిలాలపై పరిశోధనకు)
చంద్రశేఖర్ ప్రతిపాదించిన ఖగోళ భౌతికశాస్త్రం ప్రసిద్ధి చెందిన అంశం – చంద్రశేఖర్ లిమిట్
ఎక్కువ ద్రవ్యరాశి కలిగిన నక్షత్రం తన ద్రవ్యరాశిని, చంద్రశేఖర్ లిమిట్ను మించినట్లయితే అది విస్ఫోటనం చెంది సూపర్ నోవాగా ఏర్పడగా, ఆ ద్రవ్యరాశిని అంతరిక్షంలోకి వెదజల్లుతుంది. ఇలాంటి సందర్భాల్లో విడుదలైన శక్తి లక్షలాది అణుబాంబుల శక్తికి సమానంగా ఉంటుందని వివరించాడు.
ఏ నక్షత్రమైనా కృష్ణబిలంగా మారాలంటే ఒక నిర్దిష్ట ద్రవ్యరాశి కంటే ఎక్కువ ఉండాలి. సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ ఈ నిర్దిష్ట ద్రవ్యరాశి పరిమితిని కనుక్కున్నాడు. దీన్నే చంద్రశేఖర్ లిమిట్ అంటారు. ఈ పరిమితి మన సూర్యుడి ద్రవ్యరాశి కంటే 1.5 (ఒకటిన్నర) రెట్లు అధిక ద్రవ్యరాశి.
ఎ.పి.జే అబ్దుల్ కలాం
A P J Abdul
అబ్దుల్ కలాం భారతీయుడు.
భారత రాష్ట్రపతి అయ్యేనాటికి తన జీవితంలో నాలుగు దశలు దాటి వచ్చారు.
మొదటి దశ (1963-82)
ISRO లో వివిధ హోదాల్లో పనిచేశారు.
తుంబా ఉపగ్రహ ప్రయోగ వాహక బృందంలో చేరాడు. అక్కడే S.L.V-3 మిషన్ ప్రాజెక్టు డైరెక్టర్ అయ్యాడు.
కలాం నేతృత్వంలోని స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం (S.L.V-3) ద్వారా రోహిణి అనే శాస్త్ర పరిజ్ఞాన సంబంధ ఉపగ్రహాన్ని 1980లో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
మన రాకెట్ వ్యవస్థ బలం పుంజుకుంది కలాం హయాంలోనే.
రెండో దశ (1982-92)
1992లో DRDO (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్)లో చేరారు.
DRDO డైరెక్టర్గా ఆయన ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కు సారథ్యం వహించాడు.
కలాం ఆధ్వర్యంలో తయారైన మిసైల్స్
నాగ్ (యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్)
పృథ్వీ (బాటిల్ ఫీల్డ్ మిసైల్)
ఆకాశ్ (ఎయిర్ మిసైల్)
త్రిశూల్ (క్విక్ రియాక్షన్ ఎయిర్ మిసైల్)
అగ్ని (మధ్యశ్రేణి మిసైల్)
ఆయనను ‘మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు.
మూడో దశ (1992-2001)
1992లో భారతదేశ రక్షణ మంత్రికి సాంకేతిక సలహా దారు అయ్యాడు.
ఈయన కృషి ఫలితంగానే 1998లో పోఖ్రాన్ -II అణు పరీక్షలు విజయవంతంగా జరిగాయి.
ఫలితంగా భారతదేశం అణ్వస్త్ర దేశాల సరసన నిలిచింది.
నాలుగో దశ: 2001 ప్రారంభం
2001లో అన్నా యూనివర్సిటీలో టెక్నాలజీ అండ్ సొసైటీ ట్రాన్స్ఫర్మేషన్ ప్రొఫెసర్గా చేరారు.
టెక్నాలజీ లక్ష్యాల సాధనలో తన కలలను సాకారం చేసుకునేందుకు యువకుల మేథస్సుకు చురుకు పుట్టించాలనుకున్నారు. 2003 ఆగస్టులోగా లక్ష మంది విద్యార్థులను కలిసి ఆయన ప్రసంగాలతో స్ఫూర్తినిచ్చారు. అప్పటికే 40 వేల మందిని కలిశాక 2002, జూలై 25న రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
ఈయనకు 1981లో పద్మభూషణ్, 1990లో పద్మవిభూషణ్, 1997లో భారతరత్న పురస్కారాలు లభించాయి.
30 విశ్వవిద్యాలయాల నుంచి డాక్టరేట్స్ అందుకున్న గొప్ప వ్యక్తి.
రాసిన పుస్తకాలు
ఇండియా 2020
ఇగ్నైటెడ్ మైండ్స్
ఇండియా మై డ్రీమ్
ఎన్విజియోనింగ్ యాన్ ఎంపవర్డ్ నేషన్
స్వీయజీవిత చరిత్ర – ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’
ఇతరులు రాసిన జీవిత చరిత్రలు
ఎటర్నల్ క్వెస్ట్- లైట్ అండ్ టైమ్స్ ఆఫ్ డాక్టర్ అవుల్ పకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం
ప్రెసిడెంట్ ఎ.పి.జె కలాం
ఎ.పి.జె అబ్దుల్ కలాం -ద విజనరీ ఆఫ్ ఇండియా
సైంటిస్ట్ టు ప్రెసిడెంట్ -ఎ.పి.జె. అబ్దుల్ కలాం
ఎ లిటిల్ డ్రీమ్ (డాక్యుమెంటరీ ఫిల్మ్)
ఉద్యోగుల సివిల్ లిస్ట్(1894) నివేదిక
హైదరాబాద్ రాజ్యంలో మొత్తం గెజిటెడ్ ఆఫీసర్స్ 680. అందులో ముల్కీలు 233, నాన్ముల్కీలు 447.
1916లో ముల్కీ ఉద్యమాన్ని అధికారికంగా తొలిసారిగా ప్రారంభించినవారు- కిషన్ పెర్షాద్ (హైదరాబాద్ లాయర్).
ఈ ముల్కీ ఉద్యమంలో పాల్గొన్నవారు సర్ నిజామత్ జంగ్, అక్బర్ అలీఖాన్.
1901లో కారన్ వాకర్ అనే ఆంగ్లేయుడు(నాన్ లోకల్) నిజాం దర్బార్లో ఫైనాన్షియల్ సెక్రటరీగా చేరి తర్వాత కాలంలో ఆర్థిక మంత్రి అయ్యాడు.
అప్పటి నిజాం రాజ్యంలోని ఆంగ్ల ప్రభుత్వ ప్రతినిధి ‘కిషన్ పెర్షాద్(కిషన్ ప్రసాద్)’ ముల్కీలకు అండగా నిలిచాడు.
నోట్: మీర్ ఉస్మాన్ అలీఖాన్ మొదటి ప్రధాని – కిషన్ పెర్షాద్(ముల్కీ)
తర్వాత కాలంలో కిషన్ పెర్షాద్, కారన్వాకర్(నాన్ లోకల్)కు మధ్య వాగ్వివాదం జరిగింది.
ఫలితంగా ఈ ముల్కీ సమస్య విషయంలో ప్రభుత్వం స్పందించింది.
మీర్ మహబూబ్ అలీఖాన్ (1869-1911) 1910లో ముల్కీ నిబంధన అనే ఫర్మానాను జారీ చేశాడు.
ఉస్మాన్ అలీఖాన్ (7వ నిజాం) కాలంలో ముల్కీ నిరసనలు ఉద్యమ రూపంగా మారి తీవ్ర సంఘర్షణకు దారితీశాయి.
ముల్కీల చైతన్యానికి కృషి చేసిన వ్యక్తి- అఘోరనాథ్ ఛటోపాధ్యాయ.