న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూంచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చేనెల 8న దరఖాస్తు గడువు ముగియనుంది. నోటిఫికేషన్ ద్వారా 950 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నది. డిగ్రీ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
మొత్తం ఖాళీలు: 950
అర్హత: 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి, అభ్యర్థులు 20 నుంచి 28 ఏండ్ల మధ్య వయస్కులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ప్రొవిజనల్ టెస్ట్ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 17
దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 8
పరీక్ష తేదీ: మార్చి 26, 27 తేదీల్లో
వెబ్సైట్: rbi.org.in