న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైనవారు ఈ నెల 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోచ్చు. మొత్తం 50 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో టెక్నికల్ ఆఫీసర్ ఆర్కిటెక్ట్, ఫస్ట్ సేఫ్టీ ఆఫీసర్స్, ఫారెక్స్ ఆఫీసర్స్, ఫారెక్స్ డీలర్ మార్కెటింగ్ ఆఫీసర్స్, రిలేషన్షిప్ మేనేజర్స్, డాటాఎంట్రీ అనాలిసిస్, ట్రెజరీ డీలర్స్ వంటి పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఆన్లైన్ దరఖాస్తులు నేటినుంచి ప్రారంభమయ్యాయి.
మొత్తం పోస్టులు: 50
ఇందులో మార్కెటింగ్ ఆఫీసర్ 25, ఫారెక్స్ ఆఫీసర్ 13, ఫారెక్స్ ఆఫీసర్ 3, టెక్నికల్ ఆఫీసర్ ఆర్కిటెక్ట్ 2, ఫారెక్స్ డీలర్ 2, డాటా అనలిస్ట్ 2, ట్రెజరీ డీలర్ 2, ఫస్ట్ సేఫ్టీ ఆఫీసర్ 1 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
ఎంపిక విధానం: టెక్నికల్ ఆఫీసర్ ఆర్కిటెక్ట్, ఫస్ట్ సేఫ్టీ ఆఫీసర్, ఫారెక్స్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్, రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులకు రాతపరీక్ష, ఫారెక్స్ డీలర్, డాటాఎంట్రీ అనలిస్ట్, ట్రెజరీ డీలర్ పోస్టులకు ఎంపిక చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.1003, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.177
దరఖాస్తులు ప్రారంభం: నవంబర్ 5
దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 20
వెబ్సైట్: www.punjabandsindbank.co.in