హైదరాబాద్: డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం పాలిసెట్-2021 పరీక్ష మరికొద్ది సేపట్లో ప్రారంభంకానుంది. ఆఫ్లైన్లో జరుగుతున్న ఈ పరీక్షను శనివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నారు. ఈ ప్రవేశపరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 411 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది 1,02,496 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు. 11 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఎస్బీటీఈటీ యాప్ ద్వారా పరీక్ష కేంద్రం లొకేషన్ను తెలుకునే అవకాశం కల్పించారు. కరోనా సోకినవారికి సమీప దవాఖానల్లో ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు.