B.Ed Revaluation | ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్కు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫలితాలను ఇప్పటికే విడుదల చేశామని, ఫలితాలను తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.
మార్కుల మెమోలను సంబంధిత కళాశాల నుంచి మూడు వారాల తర్వాత పొందవచ్చని శశికాంత్ తెలిపారు. ఈ ఫలితాల రివాల్యుయేషన్కు ఒక్కో పేపర్ కు రూ.700 చొప్పున చెల్లించి ఈ నెల 25వ తేదీలోగా, రూ.200 అపరాధ రుసుముతో 28వ తేదీ వరకు టీఎస్ ఆన్లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జవాబు పత్రాల నకలు కావాల్సిన విద్యార్థులు ఒక్కో పేపర్ కు రూ. 1000 చొప్పున చెల్లించి వచ్చే నెల 14వ తేదీ వరకు, రూ. 200 అపరాధ రుసుముతో 18వ తేదీ వరకు తమ కార్యాలయంలో చెల్లించాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్లో చూసుకోవాలని సూచించారు.