న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎన్టీపీసీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైనవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, అప్లికేషన్లు ఈనెల 21 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 60 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇవి ఫైనాన్స్, హెచ్ఆర్ విభాగంలో ఖాళీగా ఉన్నాయి. ఆన్లైన్ రాతపరీక్ష ద్వరా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
మొత్తం ఖాళీలు: 60
ఇందులో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఫైనాన్స్ (సీఏ/సీఎంఏ)- 20, ఎంబీఏ 10, హెచ్ఆర్ 30 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సీఏ, సీఎంఏ, ఎంబీఏ, డిగ్రీ, సంబంధిత సబ్జెక్టులో పీజీ డిప్లొమా చేసి ఉండాలి. అభ్యర్థులు 29 ఏండ్లలోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ రాతపరీక్ష
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.300, ఎస్టీ, ఎస్సీ, పీడబ్ల్యూడీ, ఎక్స్సర్వీస్మెన్ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 21
వెబ్సైట్: www.ntpc.co.in