దేశంలోనే తొలిసారిగా బయోబ్యాంకును ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
ఆర్టీఎస్ ఎస్ అనే పదం ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది ఏంటి? (సి) ఎ) రెండు తెలుగు రాష్ర్టాల ఆర్టీసీల సమన్వయం కోసం ఏర్పడిన సంస్థ బి) కరోనాకు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తున వ్యాక్సిన్ సి) మలేరియా వ్యాక్సిన్ డి) కరోనా డీఎన్ఏ శ్రేణి వివరణ: మలేరియాను అడ్డుకోడానికి తొలిసారిగా ఒక వ్యాక్సిన్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసింది. అదే ఆర్టీఎస్ ఎస్. దీనిని గ్లాక్సో స్మిత్ైక్లెన్ సంస్థ అభివృద్ధి చేసింది. చిన్న పిల్లలకు సోకే ప్లాస్మోడియం ఫాల్సిఫారం మలేరియా నివారణే లక్ష్యంగా మూడు దశాబ్దాలుగా పరిశోధన కొనసాగింది. ప్రపంచ మలేరియా నివేదిక-2020 ప్రకారం 2019లో 22.9 కోట్ల మంది ఇబ్బందులు పడ్డారు. 4.09 లక్షల మంది మరణించారు. వైద్య చికిత్సల వ్యయం, ఉత్పాదక నష్టాలను లెక్కలోకి తీసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా ఏడాదికి మలేరియాతో నష్టం రూ.90 వేల కోట్లు.
సాహిత్యంలో నోబెల్ పొందిన అబ్దుల్ రజాక్ గుర్నా ఏ దేశానికి చెందిన వ్యక్తి? (డి) ఎ) ఉజ్బెకిస్థాన్ బి) తజికిస్థాన్ సి) ఇరాన్ డి) టాంజానియా వివరణ: టాంజానియా దేశానికి చెందిన నవలా రచయిత అబ్దుల్ రజాక్ గుర్నాకు 2021 నోబెల్ సాహిత్య బహుమతి దక్కింది. వలస వాదులపై పోరాటంతో పాటు శరణార్థుల కష్టాలను రచించినందుకు ఈ పురస్కారం లభించింది. హిందూ మహాసముద్రంలోని జాంజిబార్ ద్వీపంలో ఆయన జన్మించారు. 1960 చివర్లో శరణార్థిగా ఇంగ్లండ్కు వలస వెళ్లారు. 1963లో బ్రిటిష్ వలస పాలన నుంచి జాంజిబార్ స్వాతంత్య్రం పొందింది. టాంజానియాలో భాగమయ్యింది. ఆ తర్వాత కూడా వివక్ష కొనసాగడంతో మళ్లీ ఇంగ్లండ్కు వలస వెళ్లారు.
కింది వాటిలో సరైనవి? (సి)
ఆహార శుద్ధి రంగంలో భారీ యూనిట్లతో పాటు సూక్ష్మ పరిశ్రమలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది
ఎగుమతులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ నిర్ణయించింది ఎ) 1 బి) 2 సి) 1, 2 డి) ఏదీకాదు వివరణ: ఆహార శుద్ధి రంగంలో భారీ యూనిట్లతో పాటు సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. పచ్చళ్లు, కారం పొడులు, అప్పడాలు, పోషకాహార చిరుతిళ్ల తయారీ వంటి పదివేలకుపైగా సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటుకు మహిళల స్వయం సహాయక సంఘాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వారికి రూ.40 వేల మూల నిధి సమకూర్చనున్నారు. తెలంగాణలో ఎగుమతులను ప్రోత్సహించడానికి 33 జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉత్పత్తుల ఎంపిక, మౌలిక వసతుల కల్పన, కార్యాచరణకు జిల్లా స్థాయి కమిటీలను నియమించనున్నారు. ఎగుమతుల రంగంలో ప్రథమ స్థానం పొందడమే లక్ష్యంగా వికేంద్రీకృత ప్రోత్సాహక విధానం అవలంబించాలని, ప్రతి జిల్లాను ఓ హబ్గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దేశంలోనే తొలిసారిగా బయోబ్యాంకును ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? (బి) ఎ) పుణే బి) హైదరాబాద్ సి) గురుగ్రామ్ డి) కోల్కతా వివరణ: దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్లో బయోబ్యాంక్ ఏర్పాటు కానుంది. వ్యాధుల నిర్ధారణకు అవసరమైన వివరాలను డిజిటల్ రూపంలో అందరికీ అందుబాటులోకి తేనున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఏదైనా వ్యాధిని నిర్ధారించాల్సి వచ్చినప్పుడు సమగ్ర డయాగ్నసిస్ చేయాల్సిన అవసరం లేకుండా డిజిటల్ రూపంలో ఉన్న డేటాతో సరిపోల్చి తెలుసుకొనే వీలుంటుంది. ప్రస్తుతం ఆస్పత్రులు లేదా డయాగ్నస్టిక్ కేంద్రాలతో రోగి నుంచి నమూనాలు తీసుకొని మైక్రోస్కోప్లో చూసి వ్యాధి కారకాలు ఉన్నాయో లేదో నిపుణులు నిర్ధారిస్తున్నారు. ఆ సిబ్బంది కొరత ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బయోబ్యాంక్ అందుబాటులోకి వస్తే ఈ సమస్య తీరుతుంది.
ఐఎంపీఎస్ పరిమితిని ఎంత నుంచి ఎంతకు ఆర్బీఐ పెంచింది? (ఎ) ఎ) రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు బి) రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షలకు సి) రూ.లక్ష నుంచి రూ.4 లక్షలకు డి) రూ.2 లక్షల నుంచి ఎంతైనా వివరణ: తక్షణమే చెల్లింపుల సేవను ఇంగ్లిష్లో ఐఎంపీఎస్ (ఇమ్మిడియట్ పేమెంట్ సర్వీస్) అంటారు. ఈ లావాదేవీల గరిష్ట పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. డిజిటల్ లావాదేవీలను మరింతగా ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఇంటర్నెట్ అవసరం లేకుండా ఆఫ్లైన్ ద్వారా కూడా రిటైల్ డిజిటల్ చెల్లింపులు చేసే విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు యత్నాలు ప్రారంభించింది.
కింది వాటిని జతపరచండి? (సి)
రెపోరేట్ ఎ) 18%
రివర్స్ రెపోరేట్ బి) 4.25%
బ్యాంక్ రేటు సి) 3.35%
చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి డి) 4% ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి బి) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి సి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ డి) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి వివరణ: ఎలాంటి మార్పులు లేకుండా ద్రవ్య విధానాన్ని ఆర్బీఐ తాజాగా ప్రకటించింది. నగదు నిల్వల నిష్పత్తి 4 శాతంగా, అలాగే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ను 4.25% వద్ద ఉంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధిరేటు అంచనాను 9.5 శాతంగా ఆర్బీఐ కొనసాగించింది. పెట్రో ఉత్పత్తులపై అధిక పన్నులు ద్రవ్యోల్బణం పెరిగేందుకు కారణమవుతుందని అభిప్రాయపడింది. సమీప భవిష్యత్తులో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని పేర్కొంది.
‘డీడీఎస్ఎస్ఎస్ఆర్’ దేనికి సంబంధించింది? (బి) ఎ) దూరదర్శన్కు సంబంధించిన కొత్త చానల్ బి) జన్యు సమాచారానికి సంబంధించిన టూల్ సి) దీన్ దయాళ్ ఉపాధ్యాయ పథకంలో కొత్త విధానం డి) అంతరిక్షంలో కొత్తగా గుర్తించిన ఉల్కా వివరణ: మనిషి జన్యుక్రమాన్ని కేవలం 40 నిమిషాల్లో తెలుసుకొనేలా సీసీఎంబీ పరిశోధకులు రూపొందించిన టూల్ లేదా సాఫ్ట్వేర్కు పెట్టిన పేరే డీడీఎస్ఎస్ఎస్ఆర్. ప్రతి మనిషిలో 99% జన్యువులు ఒకేలా ఉంటాయి. ఒక్క శాతమే వేర్వేరుగా ఉంటాయి. ఇవే మనిషిని ప్రత్యేకంగా నిలబెడతాయి. మానవ శరీరంలోని ప్రతి కణంలోని మధ్య భాగంలో మెలికలు తిరిగిన నిచ్చెన ఆకారంలో డీఎన్ఏ ఉంటుంది. ఇది ఏ, టీ, జీ, సీ అణువులతో తయారవుతుంది. మన జన్యు సమాచారం వీటి అమరికపైనే ఆధారపడి ఉంటుంది. వాటిలో కొన్ని వరుసగా పునరావృతమవుతాయి. వీటినే శాస్త్రీయ భాషలో టాండమ్ రిపీట్స్గా వ్యవహరిస్తారు. వాటిలో పునరావృతమయ్యే కాంబినేషన్లు 5 వేల వరకు ఉంటాయని అంచనా. మానవ జీనోమ్ పెద్దది కావడంతో వీటిని కంప్యూటర్పై విశ్లేషించినా తీవ్ర జాప్యం జరుగుతుంది. అందుకే ఈ టూల్ను అభివృద్ధి చేశారు.
చనాకా-కొరాటా సాగునీటి ప్రాజెక్ట్ ఏ నదికి సంబంధించింది? (డి) ఎ) మూసీ బి) కృష్ణా సి) మంజీర డి) పెన్గంగ వివరణ: ఆదిలాబాద్ జిల్లాలో పెన్గంగ నదిపై చనాకా-కొరాటా అంతర్రాష్ట్ర సాగునీటి ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నారు. దీనికి కొన్ని షరతులతో జాతీయ వన్యప్రాణి మండలి ఆమోదం తెలిపింది. చనాకా గ్రామం మహారాష్ట్రలో ఉంది. కొరాటా గ్రామం తెలంగాణలో ఉంది. ఈ ప్రాజెక్ట్లో 213.48 హెక్టార్ల అటవీయేతర భూమి తిప్పేశ్వర్ పర్యావరణ అనుకూల వన్యప్రాణి సంరక్షణ ప్రాంత పరిధిలో ఉంది. దీంతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి పర్యావరణ అనుమతులతో పాటు జాతీయ వన్యప్రాణి మండలి ఆమోదం తప్పనిసరైంది. నిర్మాణ పనుల్లో తక్కువ శబ్దం వచ్చే యంత్రాలను ఉపయోగించడంతో పాటు ప్రాజెక్ట్ వ్యయంలో రెండు శాతం వన్యప్రాణి సంరక్షణ ప్రాంతం అభివృద్ధికి వెచ్చించాలన్న నిబంధన కూడా ఉంది.
ఏ దేశం ఇటీవల ‘స్పోర్ట్స్ వాషింగ్’కు పాల్పడుతుందని విమర్శలు ఎదుర్కొంది? (సి) ఎ) పాకిస్థాన్ బి) అమెరికా సి) సౌదీఅరేబియా డి) రష్యా వివరణ: గతంలో మానవ హక్కులను ఉల్లంఘించి చెడ్డపేరు మూటగట్టుకున్న దేశాలు ఆ పేరును తుడిపేసుకోడానికి వివిధ క్రీడలను నిర్వహించడాన్ని ‘స్పోర్ట్స్ వాషింగ్’ అంటారు. ఇటీవల సౌదీ అరేబియా దీనికి పాల్పడుతుందని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఆ దేశం న్యూ క్యాజిల్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ను కొన్నది. 1934లో ఇటలీ ఫిఫా ప్రపంచకప్ను నిర్వహించింది. 1936లో జర్మనీ ఒలింపిక్ క్రీడలను నిర్వహించడం కూడా అలాంటిదే.
కింది ఏ దేశాల్లో అత్యధికంగా బహుళ పార్శ పేదరికంలో ప్రజలు ఉన్నారని ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం పేర్కొంది? (బి) ఎ) భారత్, బంగ్లాదేశ్, నైజీరియా బి) భారత్, నైజీరియా, పాకిస్థాన్ సి) బంగ్లాదేశ్, నైజీరియా, పాకిస్థాన్ డి) భారత్, కెన్యా, ఉగాండా వివరణ: బహుళ పార్శ పేదరికంలో అత్యధికంగా భారత్, నైజీరియా, పాకిస్థాన్లో ఉన్నారని ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాలు తాజా నివేదికలో పేర్కొన్నాయి. మొత్తం 109 దేశాలకు సంబంధించిన అంశాలను నివేదిక పరిశీలించింది. మొత్తంగా 1.3 బిలియన్ ప్రజలు అంటే 21.7% మంది బహుళ పార్శ్వ పేదరికంలో జీవిస్తున్నారు. ఇందులో సగం మంది 18 ఏండ్లలోపు వాళ్లే. మొత్తం పేదల్లో 85% మంది సబ్-సహారా ఆఫ్రికా, దక్షిణాసియాలో ఉన్నారు. ఈ సూచీలో ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలను పరిశీలిస్తారు. ఆరోగ్యంలో పోషణ, శిశు మరణాల రేటు, విద్యలో విద్యాకాలం, జీవన ప్రమాణాల్లో పారిశుద్ధ్యం, వంట గ్యాస్, తాగునీరు, విద్యుత్, గృహం, ఆస్తి తదితర అంశాలను పరిశీలించి ర్యాంకులను కేటాయిస్తారు.
సుప్రీంకోర్ట్ ఇటీవల ఇచ్చిన తీర్పు ప్రకారం కింది వాటిలో సరైనది? (ఎ) ఎ) జాతీయ హరిత ట్రిబ్యునల్కు సుమోటో విచారణ అధికారం ఉంది బి) జాతీయ హరిత ట్రిబ్యునల్కు సుమోటో విచారణ అధికారం లేదు సి) జాతీయ హరిత ట్రిబ్యునల్ అనేది ఒక రాజ్యాంగ బద్ధ సంస్థ డి) ఏదీకాదు వివరణ: పత్రిక కథనాలు, లేఖలు, వినతి పత్రాలను ఆధారంగా చేసుకొని సుమోటోగా కేసులు విచారించే అధికారం జాతీయ హరిత ట్రిబ్యునల్కు ఉందని సుప్రీంకోర్ట్ పేర్కొంది. దీనినే సుమోటో అధికారం అంటారు. భవిష్యత్తు తరాలకు చక్కని వాతావరణాన్ని ఇచ్చేలా చూసే వ్యవస్థ ఉండటం దేశ క్షేమం దృష్ట్యా అవసరమని సుప్రీంకోర్ట్ వ్యాఖ్యానించింది. ఎవరూ తలుపు తట్టనప్పుడు మౌన ప్రేక్షకుడిలా ఎన్జీటీ ఉండటం తగదని తీర్పు చెప్పింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ చట్టం-2010 ప్రకారం ఈ వ్యవస్థ ఏర్పాటయ్యింది. ఆరోగ్యకరమైన వాతావరణం అనేది అధికరణ 21లో అంతర్భాగం. ఈ ఆర్టికల్ను అమలు చేసేలా ఎన్జీటీ కృషి చేస్తుంది.
తెలంగాణలో ఏ జిల్లాలో మెగా ఆక్వాహబ్ ఏర్పాటు కానుంది? (సి) ఎ) ఖమ్మం బి) సిద్దిపేట సి) రాజన్న సిరిసిల్లా డి) అలంపూర్ జోగుళాంబ వివరణ: రాజన్న సిరిసిల్లా జిల్లాలోని మధ్య మానేరు ప్రాజెక్ట్ వద్ద దేశంలోనే అతిపెద్ద స్వచ్ఛ నీటి సమీకృత చేపలు, రొయ్యల పెంపక కేంద్రం ఏర్పాటు కానుంది. 500 ఎకరాల్లో దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో సుమారు 13 వేల మంది ఉద్యోగాలు పొందనున్నారు. ఇందులో పలు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొని పెట్టుబడులు పెట్టనున్నాయి.
అర్థశాస్త్రంలో 2021కు గాను నోబెల్ ఎవరికి లభించింది? (డి) ఎ) డేవిడ్ కార్డ్ బి) గిడో ఇంబెన్స్ సి) జోషువా యాంగ్రిస్ట్ డి) పై అందరూ వివరణ: ఆర్థిక శాస్త్ర నోబెల్ను ముగ్గురికి ప్రకటించారు. కెనడాలో జన్మించి అమెరికాలో స్థిరపడిన డేవిడ్ కార్డ్ వలస కార్మిక విపణి, కనీస వేతనాలు చూపే ప్రభావంపై 1990 నుంచి పరిశోధనలు కొనసాగించారు. ఈ రంగాల్లో ఎంతోకాలంగా ఉన్న భావనలను సవాల్ చేసేలా విశ్లేషణ చేశారు. అమెరికాలోని కొలంబస్లో జన్మించిన జోషువా యాంగ్రిస్ట్, నెదర్లాండ్స్లో జన్మించి అమెరికాలో స్థిరపడిన గిడో ఇంబెన్స్ వ్యక్తులపై సుదీర్ఘ విద్య చూపే ప్రభావాన్ని విశ్లేషించారు. ఒక బృందంలోని వ్యక్తుల చదువును ఏడాది పాటు పొడిగించినప్పుడు వారందరిపై పడే ప్రభావం ఒకే విధంగా ఉండదని, దీనిపై ఒక నిశ్చితాభిప్రాయానికి రాలేదనుకున్నా, 1990లో ఇదే అంశంపై సహజ పరిశోధనలను కొనసాగించిన యాంగ్రిస్ట్, గిడో ఇంబెన్స్ విధాన ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించారు.
ఐఎస్పీఏ (ఇస్పా) దేనికి సంబంధించింది? (బి) ఎ) జీవ శాస్త్ర రంగం బి) అంతరిక్షం సి) సాంఘిక సమస్యలు డి) కంప్యూటర్ వివరణ: ఐఎస్పీఏ అంటే ఇండియన్ స్పేస్ అసోసియేషన్. అంతరిక్ష రంగాన్ని పరుగులు పెట్టించేందుకు ఏర్పాటైన ఒక ప్రైవేట్ వ్యవస్థ. వన్ వెబ్, భారతీ ఎయిర్టెల్, మ్యాప్ మై ఇండియా సంస్థలు దీనిని ఏర్పాటు చేశాయి. ఇది ప్రైవేట్ రంగంలో అంతరిక్ష స్టార్టప్లకు ఏకగవాక్ష (సింగిల్ విండో) వ్యవస్థగా పనిచేస్తుంది. అంతరిక్షం, ఉపగ్రహ సాంకేతికతల్లో అత్యంత నైపుణ్యాలు, సామర్థ్యాలను అందిపుచ్చుకోవాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేశారు. ఇందులో కోర్ సభ్యులుగా గోద్రెజ్, హ్యూగ్స్ ఇండియా, అజిస్టా-బీఎస్టీ, ఏరోస్పేస్, బీఈఎల్, సెంటమ్ ఎలక్ట్రానిక్స్, మక్సర్ ఇండియా ఉన్నాయి.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి 2593 తీర్మానం దేనికి సంబంధించింది? (సి) ఎ) కరోనా వ్యాక్సిన్లు అందరికీ అందేలా చూడటం బి) సరిహద్దుల్లో యుద్ధ వాతావరణాన్ని కట్టడి చేయడం సి) అఫ్గానిస్థాన్లో సంక్షోభ నివారణ డి) సిరియాలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ వివరణ: అఫ్గానిస్థాన్లో సంక్షోభాన్ని నివారించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాన్ని ఆమోదించిన తీర్మానమే 2593. ఈ తీర్మానం ఆమోదం పొందినప్పుడు మండలికి భారత్ నేతృత్వం వహిస్తుంది. ఇందులోని అంశాలు..
బాధ్యతాయుతమైన, జవాబుదారీ ప్రభుత్వాన్ని తాలిబన్లు ఏర్పాటు చేయాలి.