మే 12వ తేదీ 6వ తరువాయి..
పియాజే ఈ దశను 2 అంతర దశలుగా విభజించారు. అవి..
1) పూర్వ భావనాత్మక దశ/ప్రాక్ భావన దశ (ప్రీ కాన్సెప్టువల్ ఫేజ్)
ఈ దశ 2-4 సంవత్సరాల వరకు ఉంటుంది.
ఈ దశలో భాషా వికాసం చాలా వేగంగా జరుగుతుంది.
శిశువు వస్తువును గుర్తించి వాటి పోలికల ఆధారంగా వర్గీకరణలను చేయడం ప్రారంభిస్తాడు.
ఈ విధంగా చేసేటప్పుడు కొన్ని తప్పులను కూడా చేస్తాడు.
ఉదా: ఆడవాళ్లందరినీ అమ్మ అని, మగవాళ్లందరినీ నాన్న అని, ముసలివాళ్లందరినీ అమ్మమ్మ, తాతయ్య అని పిలుస్తారు.
ఈ దశలో 2 ముఖ్య పరిమితులు ఉన్నాయి. అవి.. ఎ) సర్వాత్మ వాదం బి) అహం కేంద్ర వాదం
సర్వాత్మ వాదం (ఎనిమిజం)
శిశువు జీవం (ప్రాణం) లేని వస్తువులకు జీవాన్ని ఆపాదించడమే సర్వాత్మ వాదం
ఉదా: 1) శిశువు తాను ఆడుకొనే బొమ్మలకు స్నానం చేయించి బట్టలు వేస్తాడు.
2) ఊహాత్మక క్రీడలు (మేక్ బిలీవ్ ప్లే)
ఆడుతాడు.
పిల్లలు తమ సమక్షంలో ఉన్న వాటి గురించి, లేని వాటి గురించి మాట్లాడడుతారు.
ఉదా: ఎప్పుడూ చూడని పులులు, సింహాలు, దెయ్యాలు మొదలైన వాటి గురించి మాట్లాడుతారు.
ఒక వస్తువును వేరొక వస్తువుగా భావించి ఆటలాడే ప్రతిభాసాత్మక ఆలోచన కలిగి ఉంటారు.
ఉదా: 1) చెక్క ముక్కను గుర్రం లేదా సైకిల్గా భావించి ఆడటం
2) కర్రను తుపాకీగా భావించి ఆడటం
అహం కేంద్రవాదం (ఈగో సెంట్రిజం)
శిశువు తన చుట్టూ ఉన్న ప్రపంచమంతా తన చుట్టూ కేంద్రీకరించబడిందని అందరూ తనలాగే ఆలోచిస్తారని అనుకోవడమే ‘అహం కేంద్ర వాదం’.
ఉదా: శిశువు తను నడుస్తూ ఉంటే తనతోపాటు సూర్యుడు, చంద్రుడు నడుస్తున్నారని అనుకుంటాడు.
అహం కేంద్ర వాదం ఈ దశలోనే కాకుండా మూర్త ప్రచాలక దశలో కూడా కొనసాగుతుంది.
2) అంతర్బుద్ధి దశ (ఇనిషియేటివ్ ఫేజ్)
ఈ దశ 4-7 సంవత్సరాల వరకు ఉంటుంది.
వస్తువులను పోల్చడం, వర్గీకరించడం వంటి మానసిక చర్యలను బాగా చేయగలరు.
ఉదా: ఆపిల్, నారింజ, అరటిపండ్లలో రంగు, రుచి, ఆకారంలో భేదాలున్నప్పటికీ అవన్నీ పండ్లని చెబుతారు.
సమస్యను పరిష్కరించగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ దానిని వివరించే వికాసం ఇంకా పెంపొందదు.
ఈ కాలంలో ఏర్పడే పరిమితులు 2 అవి.. ఎ) పదిలపరచుకొనే భావనాలోపం
బి) అవిపర్యాత్మక భావనాలోపం
పదిలపరచుకొనే భావనాలోపం (కన్జర్వేషన్)
ఒక వస్తువుకు బాహ్యంగా మార్పులు (ఆకారాన్ని, పరిస్థితి మార్చినా) చేసినప్పటికీ దానికి సంబంధించిన లక్షణాలు అలాగే ఉండటాన్ని ‘పదిలపరచుకొనే భావన’ అంటారు.
ఈ దశలోని పిల్లలు ఈ భావనను కలిగి ఉండకపోవడంవల్ల అడిగిన ప్రశ్నలకు తప్పు సమాధానాలు చెబుతారు.
ఉదా: రెండు సన్నని పొడవు గ్లాసుల్లో ఒకే గీత వరకు నీరు చూపించి, ఒక గ్లాసులోని నీరును వేరొక పొట్టి వెడల్పాటి గ్లాసులోకి పోసి, నీరు ఎందులో ఎక్కువ ఉందని అడిగినప్పుడు పిల్లవాడు పొడవు గ్లాసులో నీళ్లు ఎక్కువ ఉన్నాయని చెబుతాడు.
శిశువు ఒకే విశేషంపై ఆలోచనను కేంద్రీకరిస్తాడు.
అవిపర్యాత్మక భావనాలోపం/ఏకమితి
శిశువు విషయాన్ని ఒక కోణంలో మాత్రమే ఆలోచించి, దానికి భిన్నంగా ఆలోచించలేకపోవడాన్ని అవిపర్యాత్మక భావనాలోపం అంటారు.
l ప్రతి తార్కిక ప్రచాలకాన్ని తిరిగి చేయవచ్చనే భావన కలిగి ఉండడు.
ఉదా: నీ పేరేమిటి? అని అడిగితే చెప్పగలడు. కానీ మీ అమ్మ కొడుకు పేరు ఏమిటని అడిగితే చెప్పలేడు.
3) మూర్త ప్రచాలక దశ/అనియత ప్రచాలక దశ
ఈ దశ 7-11 సంవత్సరాల వరకు ఉంటుంది.
విషయాలు, వస్తువుల మధ్య పరస్పర సంబంధాలను స్థాపించగలడు.
తార్కికంగా, క్రమబద్ధంగా ఆలోచించగలడు.
విచక్షణ, తీర్మానాలను చేయడానికి ఆగమనాత్మక, నిగమనాత్మక ఉపగమాలు ఉపయోగిస్తాడు.
పూర్వ ప్రచాలక దశలోని పరిమితులను ఈ దశలో అధిగమిస్తాడు.
ఉదా: 1) ప్రార్థనా సమావేశంలో 1-4 తరగతి విద్యార్థులకు మాత్రమే రేపు సెలవు అని ప్రధానోపాధ్యాయుడు ప్రకటించినప్పుడు, 3వ తరగతి చదువుతున్న బాలుడు తనకు రేపు సెలవని పాఠశాలకు రావాల్సిన అవసరం లేదని అర్థం చేసుకుంటాడు (ఇదే నిగమనాత్మక ఆలోచన)
2) రెండు సన్నని పొడవు గ్లాసుల్లో ఒకే గీత వరకు నీటిని చూపించి ఒక గ్లాసులోని నీటిని వేరొక పొట్టి గ్లాసులోకి పోసి, నీరు ఎందులో ఎక్కువ ఉందని అడిగితే పిల్లవాడు రెండు గ్లాసుల్లో నీరు సమానమని చెబుతాడు.
3) నీ పేరేమిటి? అని అడిగితే ఈశ్వర్ అని చెప్పిన విద్యార్థి మీ అమ్మ కొడుకు పేరు ఏమిటని అడిగితే తన పేరైన ఈశ్వర్ను
చెప్పగలడు.
వాస్తవిక తర్కంతో కూడిన ఆలోచనలు మూర్త విషయాలకే పరిమితం. అంటే వీరు ఉద్దీపనలను భౌతికంగా చూస్తేనే పరిష్కరణ చేయగలడు. కానీ గైర్హాజరులో కాదు.
ఉదా: 1) శిశువు ఎక్కడి నుంచైనా తనకు తెలిసిన దారిలో ఇంటికి వెళ్లగలడు. కానీ ఇంటికి దారిని చెప్పలేడు.
2) ఒక విద్యార్థి ఎదురుగా ముగ్గురు వ్యక్తులను నిలబెట్టి వారిలో ఎవరు పొట్టి అని అడిగితే సమాధానం చెప్పగలడు. కానీ ఇదే విషయాన్ని వాక్య రూపంలో అడిగితే సమాధానం చెప్పలేడు.
పదిలపరచుకునే భావన, వర్గీకరణ శక్తి, విశ్లేషణ శక్తి అభివృద్ధి చెందుతాయి.
ఈ దశలో పిల్లల ఆలోచన ఎంతమాత్రం అహం కేంద్రీకృతంగా ఉండదు. సంఖ్య, బరువు, కాలానికి చెందిన భావనలు
ఏర్పడుతాయి.
4) అమూర్త ప్రచాలక దశ/నియత ప్రచాలక దశ
ఈ దశ 11-16 సంవత్సరాల వరకు ఉంటుంది.
తార్కిక ఆలోచన ద్వారా అమూర్తంగా వ్యవహరించడం నేర్చుకుంటారు.
మూర్త నిర్ణయాలు ప్రత్యేకతల మధ్య సంబంధాలేర్పర్చడం ప్రారంభిస్తారు.
ఈ దశలో శిశువు తన వివేచనాన్ని ఉపయోగించి తార్కిక పరిష్కారాలను అనుప్రయుక్తం చేసి సమాధానం చెప్పగలడు.
ఉదా: ఆకుపచ్చ రంగుగల పులులను జూపార్కులో ఉంచితే జూపార్కులో పులులన్నీ ఆకుపచ్చ రంగులో ఉంటాయా అని అడిగితే పులులు ఆకుపచ్చ రంగులో కాకుండా పసుపు రంగులో ఉంటాయని
తెలియజేస్తాడు.
విభిన్న కోణాల్లో ఆలోచించి సమస్యను పరిష్కరిస్తారు.
ప్రామాణీకరించిన ప్రజ్ఞా పరీక్షల్లో సగటు కంటే తక్కువ స్కోరు సాధించే వ్యక్తి అమూర్త ప్రచాలక దశను చేరుకోలేడు.
కార్యాచరణ సంబంధాన్ని అర్థం చేసుకోగలరు. ఈ దశ చివరికి సంజ్ఞానాత్మక వికాసం పూర్తవుతుంది.
నోట్: పియాజే ప్రకారం 1) ప్రాథమిక పాఠశాల దశలో మూర్త విషయాలను ప్రవేశపెట్టాలి.
2) ఉన్నత పాఠశాల దశలో అమూర్త విషయాలను ప్రవేశపెట్టాలి.
3) విద్యాలక్ష్యం, పాత తరాలు చేసినవే చేయడం కాకుండా కొత్తవాటిని చేసే మనుష్యులను సృష్టించే విధంగా ఉండాలి.
4) ప్రజ్ఞా స్థాయిలను బట్టి బోధనాంశాలు, బోధనా పద్ధతులను రూపొందించాలి.
ప్రాక్టీస్ బిట్స్
Answers
1-2, 2-1, 3-3, 4-1, 5-3, 6-4, 7-2, 8-1, 9-3, 10-4, 11-2, 12-1, 13-3, 14-2.
శివపల్లి
టీఎస్& ఏపీ సైకాలజీ ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీ సర్కిల్