హైదరాబాద్ : ఈ నెల 15న నిమ్స్లో బీఎస్సీ నర్సింగ్ కౌన్సెలింగ్ జరగనుంది. నిమ్స్లోని ఓల్డ్ ఓపీడీ బ్లాక్లో ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను వెల్లడించారు. 1 నుంచి 200 ర్యాంకులు వచ్చిన అభ్యర్థులు కౌన్సెలింగ్కు అటెండ్ కావాలని నిమ్స్ డీన్ డాక్టర్ ఎస్ రామ్మూర్తి వెల్లడించారు. కౌన్సెలింగ్కు హాజరయ్యే అభ్యర్థులందరూ తప్పనిసరిగా ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకురావాలని సూచించారు. ఇతర వివరాల కోసం www.nims.edu.in వెబ్సైట్ను లాగిన్ అవొచ్చు.