న్యూఢిల్లీ: నీట్-2021 ఫలితాలు విడుదలయ్యాయి. వీటిలో హైదరాబాద్ కుర్రాడు మృనాల్ కుట్టేరి టాపర్గా నిలిచాడు. ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీకి చెందిన తన్మయ్ గుప్తా, ముంబైకి చెందిన కార్తీక జి నాయర్ నిలిచారు. ఈ ముగ్గురూ కూడా నీట్ పరీక్షలో 720కి 720 మార్కులూ సాధించారు.
అమ్మాయిల్లో టాపర్గా కార్తీక నిలిచింది. కేరళలో పుట్టిన ఆమె ముంబైలోనే పెరిగింది. తెలంగాణకే చెందిన యువతి శరణ్య కూడా టాప్100లో స్థానం దక్కించుకుంది. కోరుట్లకు చెందిన ఈ విద్యార్థిని 60వ ర్యాంకులో నిలిచింది.
ఫలితాల కోసం అభ్యర్థులు ఎన్టీఏ అధికారిక వెబ్సైటులో చూడొచ్చు. లేదంటే https://testservices.nic.in/resultservices/NEET-2021-auth లింకు ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. ఫలితాల సమయంలో కాసేపు మొరాయించిన వెబ్సైటు మళ్లీ ఆన్లైన్లోకి వచ్చింది.