న్యూఢిల్లీ: నీట్ పీజీ ప్రవేశపరీక్ష షెడ్యూల్ విడుదలైంది. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) ఈ షెడ్యూల్ను విడుదల చేసింది. ప్రతి ఏటా NBEMS నీట్ పీజీ ప్రవేశపరీక్షను నిర్వహిస్తుంటుంది. ఆ మేరకు ఈసారి కూడా నీట్ పీజీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ను ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం జనవరి 15 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ప్రవేశ పరీక్షను మార్చి 12న నిర్వహించనున్నారు.
నీట్ పీజీ ప్రవేశపరీక్షలో 300 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష రాయడానికి 3.30 గంటల సమయం ఇస్తారు. ఈ పరీక్షలో ర్యాంకుల ఆధారంగా డీమ్డ్ యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్సటీలు, ఈఎస్ఐసీ లేదా ఏఎఫ్ఎంఎస్, ప్రైవేటు కాలేజీల్లో 50 శాతం ఆలిండియా కోటా, మరో 50 శాతం రాష్ట్ర కోటా ప్రాతిపదికన సీట్లను కేటాయిస్తారు.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం – జనవరి 15, 2022
దరఖాస్తులకు చివరి తేదీ – ఫిబ్రవరి 04, 2022
దరఖాస్తుల్లో సవరణలు – 2022, ఫిబ్రవరి 8-11 వరకు
తుది సవరణలు – 2022, ఫిబ్రవరి 24-27 వరకు
ప్రవేశపరీక్ష తేదీ – మార్చి 12, 2022
ఫలితాల విడుదల – మార్చి 31, 2022