హైరదాబాద్: రాష్ట్రంలోని లా కాలేజీల్లో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్, పీజీఎల్ సెట్ నేటినుంచి ప్రారంభం కానున్నాయి. రెండు రోజులపాటు ఈ పరీక్షలు జరుగుతాయి. మొదటి రోజు మూడేండ్ల ఎల్ఎల్బీ కోసం లాసెట్, రెండో రోజైన శుక్రవారం ఐదేండ్ల ఎల్ఎల్బీ కోసం లాసెట్, ఎల్ఎల్ఎం కోసం పీజీఎల్ సెట్ పరీక్షలు నిర్వహిస్తారు.
మూడేండ్ల ఎల్ఎల్బీ ప్రవేశ పరీక్ష.. రెండు సెషన్లలో జరుగనుంది. గురువారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
ఈరోజు లాసెట్ కోసం రాష్ట్రంలో 38 సెంటర్లు, ఆంధ్రప్రదేశ్లో నాలుగు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక శుక్రవారం జరుగనున్న పరీక్షల కోసం రాష్ట్రంలో 32, ఏపీలో నాలుగు చొప్పున కేంద్రాలను సిద్ధం చేశారు. మూడేళ్ల ఎల్ఎల్బీ కోసం 24,938 మంది, ఐదేండ్ల ఎల్ఎల్బీకి 7507, ఎల్ఎల్ఎంకు 3093 మంది దరఖాస్తు చేసుకున్నారు.