హైదరాబాద్: న్యాయ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ లాసెట్ ఫలితాలు నేడు కానున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, ఓయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ డీ రవీందర్ ఫలితాలను విడుదల చేస్తారు. ర్యాంకులు, ఫలితాల కోసం విద్యార్థులు https://lawcet.tsche. ac.in వెబ్సైట్ చూడవచ్చు.
మూడేళ్లు, అయిదేళ్ల పీజీ లాసెట్ జులై 21, 22 తేదీల్లో జరిగింది. ఈ పరీక్షలకు మొత్తం 35,538 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 28,921 మంది హాజరయ్యారు. ఫలితాల ఆధారంగా అభ్యర్థులకు ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో సీట్లు కేటాయించనున్నారు.