న్యూఢిల్లీ: కేంద్రీయ విద్యాలయాల్లో (KVS) ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి కలిగినవారు నేటి నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ నెల 26తో దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. మొత్తం 13,404 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో టీజీటీ, పీజీటీ, పీఆర్టీ, లైబ్రేరియన్, ఫైనాన్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ ఆఫీసర్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (యూడీసీ), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఎల్డీసీ), హిందీ ట్రాన్స్లేటర్, స్టెనోగ్రాఫర్ గ్రేట్-2 వంటి పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు: 13,404
ఇందులో పీఆర్టీ 6414, టీజీటీ 3176, పీజీటీ 1409, వైస్ ప్రిన్సిపల్ 203, అసిస్టెంట్ కమిషనర్ 52 చొప్పున ఖాళీలు ఉన్నాయి. వీటితోపాటు నాన్ టీచింగ్ పోస్టులు కూడా ఉన్నాయి.
అర్హతలు: పీఆర్టీ పోస్టులకు ఇంటర్ పూర్తిచేసి డీఈడీ, జేబీటీ, బీఈడీల్లో ఏదో ఒకటి చేసి ఉండాలి. టీఆర్టీ పోస్టులకు డిగ్రీ పూర్తిచేసి బీఈడీ ఉత్తీర్ణత, సీటెట్లో క్వాలిఫై కావాలి. పీజీటీ పోస్టులకు పీజీ, బీఈడీ ఉత్తీర్ణులై సీటెట్లో అర్మత సాధించాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.1000, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులు ప్రారంభం: 2022, డిసెంబర్ 5
దరఖాస్తులకు చివరితేదీ: 2022, డిసెంబర్ 26
వెబ్సైట్: www.kvsangathan.nic.in