న్యూఢిల్లీ: కేంద్రీయ విద్యాలయాల్లో (KVS) ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. రెండు, ఆపై తరగతులకు
విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తల్లిదండ్రులు, సంరక్షులకు సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల
16 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. కాగా, 11వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన
దరఖాస్తులు పదో తరగతి ఫలితాలు వచ్చిన తర్వాత ప్రారంభమవుతాయని వెల్లడించింది. అవి పదిరోజుల
పాటు కొనసాగుతాయని పేర్కొన్నది.
దేశ వ్యాప్తంగా ఉన్న కేవీల్లోని రెండు ఆపై తరగతుల్లో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేస్తారు. కాగా, 2022-23
విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటో తరగతి రిజిస్ట్రేషన్ గడువు సోమవారం (ఏప్రిల్ 11న)
ముగియనుంది.
వెబ్సైట్: www.kvsonlineadmission.kvs.gov.in