వరంగల్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు బీడీఎస్ కళాశాలల్లో కన్వీనర్ కోటా ప్రవేశాలకు వెబ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ను కాళోజి వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం విడుదల చేసింది. ఫిబ్రవరి 6వ తేదీ ఉదయం 8 గంటల నుండి 8వ తేదీ సాయింత్రం 4 గంటల వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. అభ్యర్థులు ఒకే సారి అన్ని కళాశాలలకు ప్రాధాన్యతాక్రమంలో ఆప్షన్లను నమోదు చేయాల్సి ఉంటుంది.
ఈ విడతతో పాటు మిగిలిన విడత కౌన్సిలింగ్లకు ఈ ఆప్షన్ల ఆధారంగానే సీట్ల కేటాయింపులు జరుగుతాయి. కావున అభ్యర్థులు ఇది గమనించి అన్ని కళాశాలలకు ప్రాధాన్యతాక్రమంలో తప్పని సరిగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. పూర్తి వివరాలకు వెబ్సైట్ https:/tsbdsadm.tsche.in, www.knruhs.telangana.gov.in లో చూడవచ్చని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.