ముంబై: నాశిక్లోని కరెన్సీ నోట్ ప్రెస్లో వివిధ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. జనవరి 25లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా 149 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇందులో జూనియర్ టెక్నీషియన్, సూపర్వైజర్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 149
ఇందులో జూనియర్ టెక్నీషియన్ 125, సూపర్ వైజర్ 16, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 6, వెల్ఫేర్ ఆఫీసర్ 1 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: ఒక్కోపోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి. ఐటీఐ, డిగ్రీ, పీజీ, డిప్లొమా చేసి ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 30 ఏండ్లలోపు వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.600
దరఖాస్తులకు చివరితేదీ: జనవరి 25
వెబ్సైట్: cnpnashik.spmcil.com