న్యూఢిల్లీ: మూడో విడత జేఈఈ మెయిన్ పరీక్ష అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చిన తెలిపింది. కరోనా కారణంగా వాయిదా పడిన మూడో విడుత జేఈఈ ఈనెల 20, 25 తేదీల్లో జరగనుంది. ఇందులో ఇంజినీరింగ్ కోర్సుల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మాత్రమే పరీక్షకు మాజరవుతారు. కాగా, నాలుగో విడుత జేఈఈ మెయిన్ దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ఈ పరీక్షను జూలై 27 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు ఇంజినీరింగ్తోపాటు ప్లానింగ్, ఆర్కిటెక్చర్ అభ్యర్థులు కూడా పరీక్షకు హాజరు కానున్నారు.
ఈ ఏడాది నుంచి జేఈఈ మెయిన్ను నాలుగు విడుదతలుగా నిర్వహిస్తున్న విషయం తెలిసింది. ఇప్పటికే మొదటి రెండు సెషన్లు పూర్తయ్యాయి. మూడు, నాలుగో సెషన్లు ఏప్రిల్, మే నెలల్లో జరగాల్సి ఉన్నాయి. అయితే కరోనా మహమ్మారి నేపథ్యంలో వాయిదా పడుతూ వస్తున్నాయి. తాజాగా పరీక్ష తేదీలను ఎన్టీఏ ప్రకటించింది. కాగా, విద్యార్థుల సౌకర్యం కోసం పరీక్ష కేంద్రాలను కూడా అధికం చేసింది.
వెబ్సైట్: jeemain.nta.nic