అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ మేరకు పత్రికల్లో ప్రకటన ఇచ్చింది. ఐఐటీలోని కెమికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, హ్యూమన్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగాల్లో ఈ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టుల కోసం ఎంపికైన అభ్యర్థులకు వారి అర్హతలు, అనుభవాన్ని ఆధారంగా చేసుకుని రూ.1,01,500 వరకు వేతనం చెల్లిస్తారు. అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం డిసెంబర్ 24 లోగా అధికారిక వెబ్సైట్ https://iittp.ac.in/recruitment ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.