ఉపాధ్యాయ పోస్టుల ఎంపికలో తొలి అంకం టెట్ అర్హత సాధించడం. ఈ పరీక్షలో అర్హతే కాకుండా దీనిలో వచ్చిన మార్కులకు డీఎస్సీ/టీఆర్టీలో 20 మార్కుల వెయిటేజీ ఉంది. టెట్లో వచ్చిన ప్రతి మార్కు ఉద్యోగ ఎంపికలో చాలా కీలకం. ఈ పరీక్షలో కేవలం అర్హత సాధించడమే కాకుండా అత్యధిక మార్కులు సాధించడానికి కృషి చేయాలి. ఎక్కువమంది విద్యార్థులు మ్యాథ్స్ విషయంలో ఆందోళన పడుతుంటారు. నిజానికి మ్యాథ్స్ సిలబస్లో ఉన్న ప్రతి అంశం చదివినదే అనే విషయాన్ని మరిచిపోతున్నారు. పాఠశాల సమయంలో చదివిన సబ్జెక్టే. అంతేకాదు వయస్సు రీత్యా అభ్యర్థులకు వచ్చే మెచ్యూరిటీతో ఆలోచిస్తే చాలా వరకు గణిత సమస్యలను సులభంగా చేయవచ్చు. వాటి కోసం కొంచెం శ్రమిస్తే చాలు. 30 మార్కుల మ్యాథ్స్లో కష్టపడితే సులభంగా 20 మార్కులకు పైగా సాధించవచ్చు. టెట్ సిలబస్ ఆధారంగా ప్రిపరేషన్ గురించి తెలుసుకుందాం..
టెట్ పేపర్-2