తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ సర్కారు విడుదల చేసిన ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే
ఉద్యోగార్థులకోసం నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో కరీంనగర్లో ఉచిత అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం (29-04-2022) 11.00 గంటలకు టీఎన్జీవోస్ ఫంక్షన్ ప్యాలెస్లో ఈ సదస్సు ప్రారంభం కానుంది.
ఈ సదస్సులో సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత మల్లవరపు, వేప అకాడమీ డైరెక్టర్ డాక్టర్ సీఎస్ వేప, జగిత్యాల ఎస్పీ సింధూశర్మ వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమాన్ని ఈ కింది లింక్ద్వారా యూట్యూబ్లో లైవ్ద్వారా కూడా వీక్షించవచ్చు.