న్యూఢిల్లీ: కేంద్ర అణుశక్తి శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 29 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 26 ఫిక్స్డ్ టర్మ్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేస్తున్నది. ఎంపికైనవారు కర్ణాటకలోని కైగా సైట్లో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 26
ఇందులో ఫిక్స్డ్ టర్మ్ ఇంజినీర్.. సివిల్ 11, మెకానికల్ 8, ఎలక్ట్రికల్ 8, ఎలక్ట్రికల్ 4, సీ అండ్ ఐఈసీ 2, సీఅండ్ఐ సీఎస్ 1 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్లో బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్లలో ఏదో ఒకటి చేసి ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 35 ఏండ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: జూలై 9
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 29
వెబ్సైట్: www.npcilcareers.co.in