న్యూఢిల్లీ: ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (EIL) మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఇంజినీరింగ్ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈ నెల 22 నుంచి అందుబాటులో ఉంటాయని, వచ్చేనెల 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 75 పోస్టులను భర్తీచేస్తున్నది. ఇందులో కెమికల్ ఇంజినీరింగ్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ విభాగాలు ఉన్నాయి. గేట్-2022లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు: 75
ఇందులో కెమికల్ ఇంజినీరింగ్ 6, మెకానికల్ ఇంజినీరింగ్ 25, సివిల్ ఇంజినీరింగ్ 12, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ 13, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ 9 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్ చేసి ఉండాలి. గేట్-2022 పరీక్ష రాయాల్సి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: గేట్లో వచ్చే మార్కుల ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 22
దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 14
వెబ్సైట్: engineersindia.com