ఇంటర్ పాసయ్యారా?
జేఈఈ మెయిన్-2021లో వ్యాలిడ్ స్కోర్ ఉందా? నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండి పై అర్హతలు ఉంటే కింది జాబ్ నోటిఫికేషన్
మీ కోసమే. బీటెక్ చదివించి తర్వాత కొలువు ఇస్తారు. ఆకర్షణీయమైన జీతభత్యాలు. జీవితానికి భరోసా కల్పించే కొలువులు. అంతేకాదు
దేశసేవ చేసుకునే భాగ్యం మీ సొంతం. వీటన్నింటి సమాహారమే 10+2 ఎంట్రీ స్కీం కింద నేవీ, ఆర్మీలో ప్రవేశాలు. ఆయా
నోటిఫికేషన్ల సంక్షిప్త వివరాలు మీ కోసం…
ఇండియన్ నేవీలో..
ఇండియన్ నేవీ 10+2 (బీటెక్)
క్యాడెట్ ఎంట్రీ స్కీం (పీసీ) నోటిఫికేషన్ను
విడుదల చేసింది.
10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీం (పర్మినెంట్ కమిషన్)
మొత్తం ఖాళీలు: 35వీటిలో ఎడ్యుకేషన్ బ్రాంచీ-5, ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ బ్రాంచీ-30 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు
కనీసం 70 శాతం మార్కులతో ఇంటర్ (ఎంపీసీ) ఉత్తీర్ణత. ఇంటర్ ఇంగ్లిష్ సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి. జేఈఈ మెయిన్-2021 హాజరై ఉండాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.
వయస్సు: 2003, జనవరి 2 నుంచి 2005, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక: జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంక్ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్లిస్ట్ చేస్తారు. షార్ట్లిస్ట్ చేసిన వారికి ఎస్ఎస్బీ ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తారు.
శిక్షణ: ఎంపికైనవారికి బీటెక్ (ఈసీఈ, మెకానికల్ ఇంజినీరింగ్ లేదా అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్&కమ్యూనికేషన్ ఇంజినీరింగ్) కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. వీరికి న్యూఢిల్లీలోని జేఎన్యూ డిగ్రీని ప్రదానం చేస్తుంది.
ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీం (టీఈఎస్)
ఇండియన్ ఆర్మీ జూలై 2022లో ప్రారంభమయ్యే 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీం-47వ కోర్సు ప్రకటన విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 90
ఎవరు అర్హులు?
కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్ (ఎంపీసీ) ఉత్తీర్ణత. జేఈఈ మెయిన్-2021 పరీక్షకు హాజరై ఉండాలి. వీటితోపాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
వయస్సు: 2003, జనవరి 2 నుంచి 2006, జనవరి 1 మధ్య జన్మించిన వారు అర్హులు.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్నవారిని షార్ట్లిస్ట్ చేసి ఎస్ఎస్బీ ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
ఎస్ఎస్బీ ఇంటర్వ్యూలు ఐదురోజుల పాటు నిర్వహిస్తారు. వీటిలో రెండు దశలు ఉంటాయి. మొదటి దశ పరీక్షలు ఒక్కరోజు మాత్రమే ఉంటాయి. వీటిలో అర్హత సాధించినవారికి స్టేజ్-2 పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
శిక్షణ: మొత్తం ఐదేండ్ల శిక్షణ ఉంటుంది. దీనిలో ఏడాది బేసిక్ మిలిటరీ ట్రెయినింగ్, తర్వాత ఫేజ్-1 ప్రీ కమిషన్ ట్రెయినింగ్, ఫేజ్-2 పోస్ట్ కమిషన్ ట్రెయినింగ్ ఇస్తారు. శిక్షణ, కోర్సు విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి బీటెక్ డిగ్రీని న్యూఢిల్లీలోని జేఎన్యూ ప్రదానం చేస్తుంది. అనంతరం వీరికి లెవల్-10 స్థాయిలో లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగాన్నిస్తారు.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఫిబ్రవరి 23
ఎస్ఎస్బీ ఇంటర్వ్యూలు: ఏప్రిల్లో నిర్వహిస్తారు
వెబ్సైట్: https://joinindianarmy.nic.in
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఫిబ్రవరి 8
వెబ్సైట్: https://www.joinindiannavy.gov.in