హైదరాబాద్: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL)లోని ఏఈసీ స్కూళ్లలో ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన దరఖాస్తు చేసుకోవాలని కోరింది. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి టీజీటీ, ప్రైమరీ టీచర్ ఖాళీలకు నియామక ప్రక్రియను చేపట్టింది. ఆఫ్లైన్ దరఖాస్తులు ఈ నెల 24 నుంచి ప్రారంభంకానున్నాయి. మే 28 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
ఖాళీలు..
టీజీటీ ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, మ్యాథ్స్, ఫిజిక్స్, సోషల్ సైన్సెస్, ఆర్ట్, ప్రైమరీ టీచర్లు
అర్హతలు
డిగ్రీ పూర్తిచేసి సంబంధిత సబ్జెక్టులో బీఈడీ, డీఈడీ, బీఈఐఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, స్కిల్టెస్ట్
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: మే 24
దరఖాస్తులకు చివరితేదీ: మే 28
అడ్రస్: Principal, Co-ordination, Atomic Energy, Central School – 2, DAE Colony, ECIL Post, Hyderabad – 500062
వెబ్సైట్: www.ecil.co.in