హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజినీరింగ్ సీట్ల భర్తీ ప్రక్రియ నేడు ప్రారంభంకానుంది. మొత్తం మూడు విడుతల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా మొదటి విడుత కౌన్సెలింగ్ ఆదివారం ప్రారంభమవుతుంది. ఈనెల 29 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈనెల 23 నుంచి 30 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయనున్నారు. వెరిఫికేషన్ పూర్తయిన విద్యార్థులు ఈనెల 23 నుంచి సెప్టెంబర్ 2 వరకు వెబ్ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 6న సీట్లను కేటాయిస్తారు. సెప్టెంబర్ 17 నుంచి 21 వరకు కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
మొదటి విడుత తర్వాత మిగిలిన ఇంజినీరింగ్ సీట్ల కోసం సెప్టెంబర్ 28 నుంచి రెండో విడుత, అక్టోబర్ 11న తుది విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. మిగిలన సీట్ల కోసం అక్టోబర్ 20న స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభిస్తారు.