హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (పీజేటీఎస్ఏయూ) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటనను విడుదల చేసింది.
కోర్సులు: డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ (రెండేండ్లు), డిప్లొమా ఇన్ ఆర్గానిక్ కల్చర్ (రెండేండ్లు), డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ (మూడేండ్లు)
అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణత. అగ్రికల్చరల్ స్ట్రీమ్లో పాలీసెట్-2021 పరీక్ష రాసి ఉండాలి.
వయస్సు: 15- 22 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: పాలిసెట్-2021 అగ్రికల్చరల్ స్టీమ్ ర్యాంక్ ఆధారంగా
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఆగస్టు 26
వెబ్సైట్: https://diploma.pjtsau.ac.in