న్యూఢిల్లీ: కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (CUET PG) ఫలితాలు నేడు వెలువడనున్నాయి. సాయంత్రం 4 గంటలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఫలితాలను ప్రకటించనుంది. పరీక్ష రాసిన అభ్యర్థులు cuet.nta.nic.in వెబ్సైట్లో ఫలితాలు చూసుకోవచ్చు. ఈమేరకు యూజీసీ చైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్ వెల్లడించారు. ఫలితాలతోపాటు స్కోర్కార్డులను కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. ఇప్పటికే పార్టీ కీని ఎన్టీఏ విడుదలచేసింది.
సీయూసెట్ పీజీ పరీక్షలను సెప్టెంబర్ 1 నుంచి 12 వరకు నిర్వహించారు. ఈ పరీక్షల ద్వారా తేజ్పూర్ యూనివర్సిటీ, నాగాలాండ్ వర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఒడిశా, పాండిచ్చేరి వర్సిటీ, ఇండియన్ మారిటైమ్ యూనివర్సిఈ, ఇఫ్లూ, మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ అలహాబాద్, రాజీవ్గాంధీ యూనివర్సిటీ, నలందా, బనారస్ హిందూ యూనివర్సిటీలు ఆయా పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తాయి.