హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని జేఎన్టీయూ, ఓయూ, కేయూ, పాలమూరు, తెలంగాణ, శాతవాహన, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. బుధవారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని సీపీగెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి వెల్లడించారు.
ఈ నెల 24 నుంచి వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. మొత్తం 47,925 సీట్లకు గాను తొలి విడతలో 23,647 సీట్లు భర్తీ అయ్యాయి. మిగిలిన 24,278 సీట్లను రెండో విడతలో భర్తీచేయనున్నారు.