న్యూఢిల్లీ: కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) వివిధ విభాగాల్లో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైనవారు వచ్చేనెల 7 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 481 పోస్టులను భర్తీ చేస్తున్నది. అభ్యర్థులను పరీక్ష ఆధారంగా ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు: 481
ఇందులో పర్సనల్ అండ్ హెర్ 138, ఎన్విరాన్మెంట్ 68, మెటీరియల్స్ మేనేజ్మెంట్ 115, కమ్యూనిటీ డెవలప్మెంట్ 79, లీగల్ 54, పబ్లిక్ రిలేషన్స్ 6, కంపనీ సెక్రెటరీ 4 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా పూర్తిచేసి, 30 ఏండ్ల లోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.1180
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 7
వెబ్సైట్: https://www.coalindia.in/