న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే క్లాట్-2023 దరఖాస్తు ప్రక్రియ నేడు ప్రారంభం కానుంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 22 లా విశ్వవిద్యాలయాలు యూజీ, పీజీ కోర్సుల్లో మొత్తం 2847 సీట్లను అభ్యర్థులకు సీట్లు కేటాయించనున్నారు. ఆసక్తి కలిగినవారు consortiumofnlus.ac.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 13న ముగియనుంది. ప్రవేశపరీక్షను డిసెంబర్ 18న నిర్వహిస్తారు.
క్లాట్లో హైదరాబాద్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రిసెర్చ్, విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ, నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ బెంగళూరు వంటి మొత్తం 22 వర్సిటీలు ఉన్నాయి. ఇంటర్ లేదా 12వ తరగతి పాసైనవారు క్లాట్ యూజీకి, ఎల్ఎల్బీ ఉత్తీర్ణులైన, ప్రస్తుతం ఫైనలియర్ చదువుతున్నవారు క్లాట్ ఎల్ఎల్ఎం కు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశపరీక్షలో యూజీ కోర్సులకైతే 45 శాతం, పీజీ కోర్సులకైతే 50 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.