హైదరాబాద్: ఎమ్మెస్సీ నర్సింగ్ (MSC Nursing ), ఎంపీటీ (MPT) కోర్సుల్లో సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల ప్రక్రియ ముగియడంతో మెరిట్ ఆధారంగా అభ్యర్థుల జాబితాను అధికారులు విడుదల చేశారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితా వెల్లడించనున్నట్టు తెలిపారు. ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సులకు దరఖాస్తు చేసుకొని ప్రొవిజినల్ జాబితాలో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 4న జేఎన్టీయూ కూకట్పల్లిలో ఏర్పాటుచేసిన కేంద్రానికి ధ్రువపత్రాలతో హాజరుకావాలని కోరారు.
ప్రైవేట్ హోమియోపతి కళాశాలల్లో బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు మొదటి విడుత కౌన్సెలింగ్కు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో అర్హత కలిగిన అభ్యర్థుల జాబితాను వర్సిటీ విడుదల చేసింది. మెరిట్ జాబితాలో అర్హత సాధించిన అభ్యర్థులు ఈనెల 5వ తేదీన జేఎన్టీయూ కూకట్పల్లిలో ఏర్పాటుచేసిన ఆన్లైన్ కౌన్సెలింగ్కు హాజరు కావాలని అధికారులు తెలిపారు. మరింత సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్సైట్ www.knruhs. telangana.gov.inలో పరిశీలించవచ్చు.