న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank of India) వివిధ విభాగాల్లో అప్రెంటిస్ (Apprentice) పోస్టుల భర్తీకి (Recruitment) నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు వచ్చే నెల 3 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 5 వేల అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రలో 629 పోస్టులు ఉండగా, తెలంగాణలో (Telangana) 106, ఆంధ్రప్రదేశ్లో (Andhrapradesh) 141 పోస్టుల చొప్పున ఉన్నాయి. ఆన్లైన్ రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. స్థానిక భాషలో రాయడం, మాట్లాడటం తప్పనిసరిగా వచ్చి ఉండాలి. రాతపరీక్ష ఏప్రిల్ రెండో వారంలో కానీ, మూడో వారంలో కానీ ఉంటుంది.
మొత్తం పోస్టులు: 5 వేలు
ఇందులో మహారాష్ట్రలో 629, ఉత్తరప్రదేశ్లో 615, బీహార్లో 526, మధ్యప్రదేశ్ 502, పశ్చిమబెంగాల్ 362, గుజరాత్ 342, తెలంగాణ 106, ఆంధ్రప్రదేశ్లో 141 పోస్టులు, మిగిలినవి ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నాయి.
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ రాత పరీక్ష ద్వారా. స్థానిక భాషపై పట్టును పరీక్షిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.800, దివ్యాంగులకు రూ.400, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రూ. 600
దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 3
వెబ్సైట్: centralbankofindia.co.in