న్యూఢిల్లీ: సీబీఎస్సీ బోర్డ్ ఎగ్జామ్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభంకానున్నారు. సీబీఎస్సీ స్కూల్స్లో పదో తరగతి, 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఫిబ్రవరి 15 నుంచి మే 15 మధ్య పరీక్షలను పూర్తిచేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSC) బోర్డు నిర్ణయించింది. పూర్తిస్థాయిలో షెడ్యూల్ విడుదల చేయకపోయినప్పటికీ ఈ మేరకు సీబీఎస్సీ స్కూల్స్ యాజమాన్యాలకు నోటీసులు పంపించింది. ఆ సమయంలో పాఠశాల క్యాంపస్లో ఎలాంటి పునర్నిర్మాణ, ఆధునీకరణ పనులు పెట్టుకోవద్దని, మెడికల్ రీజన్ ఉంటేతప్ప ఎవ్వరికీ సెలవలు ఇవ్వకూడదని స్పష్టం చేసింది.
గ్రేడ్ 10, 12 విద్యార్థులకు 2023, జనవరి 1 నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్, ప్రాజెక్ట్ వర్క్, ఇంటర్నల్ అసెస్మెంట్ నిర్వహించాలని ఇప్పటికే తెలిపింది. ఫిబ్రవరి 15 నుంచి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించిన విషయం ఇప్పటికే తెలిసిందే. కాగా, దేశవ్యాప్తంగా సీబీఎస్సీలో 18 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి చదువుతుండగా, 16 లక్షల మంది 12వ తరగతి అభ్యసిస్తున్నారు. కాగా, పరీక్షల షెడ్యూల్ను అధికారిక వెబ్సైట్ cbse.nic.in and cbse.gov.inలో అతిత్వరలో అందుబాటులో ఉంచనుంది.