న్యూఢిల్లీ: దేశంలోని ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటైన బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 2021–22 అకడమిక్ ఇయర్కుగాను ఎంసీఏ కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్లైన్ ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పించనుంది. రెండేండ్ల (ఫుల్టైమ్) కాలవ్యవధి కలిగిన ఈ కోర్సును రాంచీలోని బిట్ మెస్రా (మెయిన్ క్యాంపస్), జయపుర, లాల్పుర్, నోయిడా క్యాంపస్లు అందిస్తున్నాయి.
కోర్సుపేరు: ఎంసీఏ
అర్హత: బీసీఏ, బీఎస్సీలో కంప్యూటర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా తత్సమాన బ్యాచిలర్ డిగ్రీలో ఏదైనా కోర్సులో ఉత్తీర్ణత సాధించాలి.
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ టెస్ట్ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 10
వెబ్సైట్: www.bitmesra.ac.in