న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ ఇంజినీర్, ట్రైనీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు వచ్చేనెల 6వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా 63 పోస్టులను భర్తీ చేస్తున్నది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. విజయవంతంగా ఎంపికైనవారు ఘజియాబాద్లోని బీఈఎల్ యూనిట్లో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 63
ఇందులో ట్రైనీ ఇంజినీర్ 26, ప్రాజెక్ట్ ఇంజినీర్ 37 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్లో నాలుగేండ్ల బీఈ, బీటెక్, బీఎస్సీ చేసి ఉండాలి. ప్రాజెక్ట్ ఇంజినీర్కు ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థులు 28 ఏండ్లు, 32 ఏండ్లలోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.150, రూ.400
దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 6
వెబ్సైట్: bel-india.in