హైదరాబాద్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ డిగ్రీ ఫస్ట్, థర్డ్, ఫిప్త్ సెమిస్టర్ పరీక్షలు ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో నిర్వహించనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. రెండో సంవత్సరం మూడో సెమిస్టర్ పరీక్షలు ఏప్రిల్ 17 నుంచి 23 వరకు, మూడో సంవత్సరం ఐదో సెమిస్టర్ పరీక్షలు ఏప్రిల్ 25 నుంచి 30 వరకు, అలాగే మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు మే 7 నుంచి 13 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు చివరి తేదీ మార్చి 20. పరీక్షలను మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు www.braouonline.in పోర్టల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. అనంతరం ఫీజును T.S / A.P ఆన్ లైన్ సెంటర్ల ద్వారా లేదా డెబిట్ /క్రెడిట్ కార్డ్ తో మాత్రమే చెల్లించాలని సూచించారు.