బోథ్, ఏప్రిల్ 8: గ్రామానికి ప్రజాప్రతినిధురాలైనప్పటికీ పొట్టకూటికోసం కూలీ పనులకు వెళ్తున్నారు ఆదిలాబాద్ జిల్లా బోథ్-3 ఎంపీటీసీ సభ్యురాలు, ఎంపీటీసీల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు షేక్ రజియాబేగం, ఆమె భర్త నాసర్ అహ్మద్. గురువారం వారు ఉపాధి హామీలో భాగంగా తోటి కూలీలతో కలిసి కందకాల తవ్వకం పనులు చేపట్టారు. ఇద్దరికి జాబ్కార్డులు ఉండటంతో రెండేండ్లుగా ఉపాధి పనులు చేపడుతున్నారు. రోజుకు ఒక్కొక్కరికి రూ.180 నుంచి రూ.200 వరకు కూలీ గిట్టుబాటు అవుతుందని తెలిపారు.