తెలంగాణ
సీజేగా జస్టిస్ సతీష్చంద్ర శర్మ
రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ సతీష్చంద్ర శర్మ అక్టోబర్ 11న ప్రమాణం చేశారు. జస్టిస్ శర్మ రాష్ర్టానికి నాలుగో సీజేగా బాధ్యతలు చేపట్టారు. మొదటి సీజేగా తొట్టతిళ్ బీ నాయర్ రాధాకృష్ణన్, తర్వాత జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ హిమకోహ్లీ సీజేగా సేవలందించారు.
కోవెల సుప్రసన్నాచార్య
పోలూరి హనుమజ్జానకీ రామశర్మ అవార్డును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోవెల సుప్రసన్నాచార్యకు అక్టోబర్ 13న అందజేశారు. ఈ అవార్డును తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన గురువు, తెలుగు ప్రొఫెసర్ పోలూరి హనుమజ్జానకీ రామశర్మ పేరుతో ఏర్పాటు చేశారు. మొదటి అవార్డును కోవెలకు అందజేశారు. ఈ అవార్డు కింద రూ.25 వేల నగదు ఇచ్చారు.
జాతీయం
మోదీతో డెన్మార్క్ ప్రధాని
దేశ్ కా మెంటార్
లవంగానికి జీఐ
అటల్ కమ్యూనిటీ సెంటర్
పీఎం గతిశక్తి
అంతర్జాతీయం
కిర్గిజ్స్థాన్కు 200 మిలియన్ డాలర్లు
భారత విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ కిర్గిజ్స్థాన్లో రెండు రోజుల పర్యటించారు. ఈ సందర్భంగా అక్టోబర్ 11న కిర్గిజ్స్థాన్కు 200 మిలియన్ డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్ను ప్రకటించారు. ఇరుదేశాల మధ్య ఆర్థిక, సామాజిక, రక్షణ సహాయ అంశాలపై చర్చించారు.
రెన్యువబుల్ ఎనర్జీ ఇండెక్స్
ఎర్న్స్ట్ అండ్ యంగ్ అనే కన్సల్టెన్సీ సంస్థ పునరుత్పదక శక్తి (రెన్యువబుల్ ఎనర్జీ) దేశాల ఆకర్శిస్తున్న 40 దేశాల సూచీని అక్టోబర్ 13న విడుదల చేసింది. దీనిలో అమెరికా మొదటి స్థానంలో నిలువగా.. చైనా 2, భారత్ 3వ స్థానాల్లో నిలిచాయి.
యూఎన్హెచ్ఆర్సీకి భారత్
ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి (యూఎన్హెచ్ఆర్సీ)కి భారత్ మరోసారి అక్టోబర్ 14న ఎన్నికయ్యింది. 18 కొత్త సభ్యుల కోసం నిర్వహించిన ఎన్నికల్లో ఐరాస సర్వ ప్రతినిది సభలోని 193 దేశాల్లో 184 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. 2022 జనవరి నుంచి 2024 డిసెంబర్ వరకు సభ్యత్వాన్ని కలిగి ఉంటుంది. ఆసియా-పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి భారత్తో పాటు యూఏఈ, ఖతార్, కజకిస్థాన్, మలేషియా సభ్యదేశాలుగా ఎన్నికయ్యాయి.
సాగో
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ ఫర్ ది ఒరిజిన్స్ ఆఫ్ నావెల్ పాథోజెన్స్ (సాగో) పేరుతో ఓ కమిటీని అక్టోబర్ 14న ఏర్పాటు చేసింది. కరోనాపై గతంలో చేపట్టిన దర్యాప్తు అసంపూర్తిగా ముగియడంతో మరోసారి దర్యాప్తు చేపట్టనున్న ఈ కమిటీలో పలు దేశాలకు చెందిన 26 మంది సైంటిస్టులు పనిచేస్తారు. కరోనా కారక సార్స్కోవ్-2 సహా కొత్తగా వస్తున్న వ్యాధికారక సూక్ష్మజీవుల మూలాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. దీనిలో భారత్కు చెందిన అంటువ్యాధుల నిపుణుడు గంగాఖేద్కర్కు అవకాశం లభించింది.
హంగర్ ఇండెక్స్
2021కు గాను 116 దేశాల గ్లోబల్ హంగర్ ఇండెక్స్ను అక్టోబర్ 15న విడుదల చేశారు. దీనిలో సోమాలియా 116వ స్థానంలో ఉండగా.. యెమెన్ 115, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 114వ స్థానాల్లో ఉన్నాయి. భారత్ 101వ స్థానంలో ఉంది.
వార్తల్లో వ్యక్తులు
సతీశ్రెడ్డి
డీఆర్డీఓ చైర్మన్ జీ సతీశ్ రెడ్డికి ఆర్యభట్ట అవార్డు అక్టోబర్ 10న లభించింది. అంతరిక్ష రంగంలో ఆయన చేసిన సేవలకు ఆస్ట్రోనాటిక్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ఈ పురస్కారాన్ని అందజేసింది.
రాము
డొమినికన్ రిపబ్లిక్లో భారత రాయబారిగా అబ్బగాని రాము అక్టోబర్ 11న నియమితులయ్యారు. 2001 ఐఎఫ్ఎస్ అధికారి అయిన ఆయన కేంద్ర విదేశాంగ శాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నారు. తెలంగాణలోని హనుమకొండకు చెందిన ఆయన జపాన్, థాయ్లాండ్లలోని భారత రాయబార కార్యాలయాల్లో పనిచేశారు.
రణ్దీప్ గులేరియా
ఎయిమ్స్ ఢిల్లీ డైరెక్టర్ రణ్దీప్ గులేరియాకు లాల్బహదూర్ శాస్త్రీ జాతీయ అత్యుత్తమ సేవల అవార్డును అక్టోబర్ 11న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అందజేశారు. కరోనా సమయంలో ప్రజలను చైతన్యపరిచినందుకు ఈ అవార్డు దక్కింది.
అమిత్ ఖరే
ప్రధాన మంత్రి కార్యాలయంలో కార్యదర్శి హోదాలో సలహాదారుగా అమిత్ ఖరే అక్టోబర్ 12న నియమితులయ్యారు. కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేశారు. 1985 జార్ఖండ్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన ఆయన జాతీయ నూతన విద్యా విధానాన్ని అమల్లోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.
సత్య నాదెళ్ల
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు గ్లోబల్ బిజినెస్ సస్టెయినబిలిటీ లీడర్షిప్ విభాగంలో సీకే ప్రహ్లాద్ అవార్డు అక్టోబర్ 13న లభించింది. 2010లో కార్పొరేట్ ఎకో ఫోరం (సీఈఎఫ్) భారతీయ అమెరికన్ అయిన ప్రహ్లాద్ గౌరవార్థం ఈ అవార్డును ఏర్పాటు చేసింది. 2030 నాటికల్లా కర్బన రహిత సంస్థగా మైక్రోసాఫ్ట్ను మార్చడం, 2050 నాటికల్లా చరిత్రాత్మక ఉద్గారాలన్నిటినీ తొలగించాలన్న లక్ష్యంతో పనిచేస్తన్నందుకు ఈ అవార్డు లభించింది.
ఏకే గోయల్
ది ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) చైర్మన్గా యూకో బ్యాంక్ ఎండీ అతుల్ కుమార్ గోయల్ అక్టోబర్ 14న ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్లుగా ఎస్బీఐ చైర్మన్ దినేశ్కుమార్ ఖారా, కెనరా బ్యాంక్ ఎండీ ఎల్వీ ప్రభాకర్, ఐడీబీఐ బ్యాంక్ ఎండీ రాకేశ్ శర్మ ఎంపికయ్యారు.
రవి చౌదరి
భారత అమెరికన్ అయిన రవి చౌదరి అమెరికా రక్షణ కా ర్యాలయం పెంటగాన్లో ఎయిర్ఫోర్స్ ఫర్ ఇన్స్టాలేషన్స్ అండ్ ది ఎన్విరాన్మెంట్ విభాగానికి అసిస్టెంట్ సెక్రటరీగా అక్టోబర్ 16న నియమితులయ్యారు. ఆయన 1993-2015 వరకు వాయుసేనలో వివిధ హోదాల్లో పనిచేశారు. సి-17 యుద్ధ విమాన పైలట్ అయిన ఆయన అఫ్గానిస్థాన్, ఇరాన్ కీలక ఆపరేషన్లో పాల్గొన్నారు.
క్రీడలు
ఇభా
వచ్చే ఏడాది భారత్లో నిర్వహించే అండర్-17 గర్ల్స్ ఫుట్బాల్ వరల్డ్ కప్ మస్కట్ను ఫిఫా ప్రధాన అధికారి సరైన్ బెరెమన్ అక్టోబర్ 11న ఆవిష్కరించారు. ఆసియా ఆడసింహాన్ని మస్కట్గా ఎంచుకొని ‘ఇభా’ అని పేరుపెట్టారు.
ఎమీ హంటర్
ఇంటర్నేషనల్ క్రికెట్ (పురుషులు, మహిళలు కలిపి) వన్డేల్లో సెంచరీ సాధించిన పిన్న వయస్కురాలిగా ఐర్లండ్ బ్యాటర్ ఎమి హంటర్ రికార్డు సృష్టించింది. తన 16వ జన్మదినం అయిన అక్టోబర్ 11న జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో 121 పరుగులు (127 బంతులు) చేసి ఈ ఘనత సాధించింది. 1999లో 16 ఏండ్ల 205 రోజుల వయస్సులో మిథాలీరాజ్ ఐర్లాండ్పై సెంచరీ కొట్టింది.
రొనాల్డో
ఇంటర్నేషనల్ ఫుట్బాల్లో పది హ్యాట్రిక్లు నమోదు చేసిన తొలి ఆటగాడిగా క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్) అక్టోబర్ 13న రికార్డు సాధించాడు. 2022 ప్రపంచకప్ గ్రూప్-ఎ క్వాలిఫయింగ్ మ్యాచ్లో లక్సెంబర్గ్తో జరిగిన పోటీలో హ్యాట్రిక్ గోల్ చేశాడు. మొత్తంగా ఫుట్బాల్ కెరీర్లో హ్యాట్రిక్ గోల్ చేయడం అతడికి ఇది 58వ సారి.
సునీల్ ఛెత్రి
ఇంటర్నేషనల్ ఫుట్బాల్లో అత్యధిక గోల్స్ సాధించిన వారిలో 6వ వాడిగా భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి నిలిచాడు. అక్టోబర్ 14న శాఫ్ చాంపియన్షిప్లో మాల్దీవులతో జరిగిన మ్యాచ్లో చేసిన గోల్తో ఈ ఘనత సాధించాడు. అతడు చేసిన ఈ 79వ గోల్తో ఫుట్బాల్ దిగ్గజ క్రీడాకారుడు పీలే (బ్రెజిల్)ను అధిగమించి గాడ్ఫ్రే (బాంబియా)తో కలిసి సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచాడు. క్రిస్టియానో రొనాల్డో (115) 1, అలీ దాయ్ (ఇరాన్-109) 2, మొఖ్తార్ దహరీ (మలేషియా-89) 3, ఫెరెంక్ పుస్కాస్ (హంగేరి-84) 4, లియోనల్ మెస్సీ (అర్జెంటీనా-80) 5వ స్థానాల్లో ఉన్నారు.
వేముల సైదులు
జీకే, కరెంట్ అఫైర్స్ నిపుణులు
ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్ హైదరాబాద్