సిటీబ్యూరో, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తం చేసేలా నిర్మితమవుతున్న యాదాద్రిలో మరో అద్భుతం చేరబోతున్నది. సకల వసతులతో అంతర్జాతీయ నాణ్యతతో లగ్జరీ హోటల్ కొలువుదీరబోతున్నది. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ యాదాద్రిని మహా పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రపంచ దేశాలు అబ్బురపడేలా ఆలయ నిర్మాణం చేయిస్తున్నారు. దాదాపు పూర్తికావొచ్చిన ఆలయ నిర్మాణం ఇప్పటికే నభూతో నభవిష్యత్ అన్న రీతిలో ఆకట్టుకుంటున్నది. ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏమాత్రం తీసిపోకుండా దేశ విదేశాల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉన్నది.
రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఇతర ప్రముఖులు సందర్శించనున్న నేపథ్యంలో అత్యుత్తమ ఆతిథ్యం కల్పించేలా హోటల్ను తీర్చిదిద్దుతున్నారు. పుణ్యక్షేత్రానికి కేవలం 2.4 కిలో మీటర్ల దూరంలోనే ఈ హోటల్ నిర్మితమవుతున్నది. లక్ష్మీ నివాసం, అపీజే సురేంద్ర పార్క్ హోటల్స్ సంయుక్తంగా ఈ హోటల్ను నిర్మించాయి. రూ.100 కోట్ల పెట్టుబడితో నిర్మితమవుతున్న ఈ అంతర్జాతీయ హోటల్ వచ్చే ఏడాది మార్చి 20న అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నది.
అపీజే సురేంద్ర గ్రూప్ ఆఫ్ హోటల్స్ బ్రాండ్ అయిన జోన్ కనెక్ట్ పర్యవేక్షణలో ఈ హోటల్ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. శుక్రవారం సోమాజిగూడలోని ది పార్క్ హోటల్లో లక్ష్మీ నివాసం చైర్మన్ రాజేంద్ర ప్రసాద్, నేషనల్ హెడ్ ది పార్క్ జనరల్ మేనేజర్ వికాస్ అహ్లూవాలియ హోటల్ విశేషాలను వెల్లడించారు. యాదాద్రి అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని, యావత్ ప్రపంచం చూపు ఈ పుణ్యక్షేత్రంపైనే ఉన్నదని, యాదాద్రిలో తమ సంస్థ తరపున నిర్మించిన లగ్జరీ హోటల్ భక్తులు, యాత్రికులకు మరిచిపోలేని ఆతిథ్యం అందించేలా ఉండనున్నదని తెలిపారు.
450 ఎస్ఎఫ్టీ సూట్ను రూ.21.50 లక్షలకు కొనుగోలు చేసుకునే అవకాశాన్ని యాజమాన్యం కల్పిస్తున్నది. కేవలం రూ.2లక్షల టోకెన్ అమౌంట్తో సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ లోన్ అందుబాటులో ఉన్నది. ఇది డీటీసీపీ అప్రూవ్డ్ ప్రాజెక్టు. నెలకు రూ.12వేల అద్దెతో కూడా సూట్ను ఉపయోగించుకోవచ్చు. మరింత సమాచారం కోసం 91002 62986, 8810 221986 నంబర్లను సంప్రదించొచ్చు.