అమరావతి: నెల్లూరు నగర పాలక సంస్థలో అధికార వైఎస్సార్సీపీ భారీ విజయం సాధించింది. ఈ కార్పొరేషన్లో ఉన్న అన్ని వైఎస్సార్సీపీ స్థానాలను కైవసం చేసుకోగా తెలుగుదేశం పార్టీ ఏ ఒక్క స్థానాన్ని దక్కించుకోకపోవడం శోచనీయం. ఈ కార్పొరేషన్లో మొత్తం 54 డివిజన్లు ఉండగా 54 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. మొత్తం 8 డివిజన్లలో వైస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం కాగా.. 46 డివిజన్లలో ఎన్నికలు జరిగాయి. అయితే వీటిలో మొత్తం 46 డివిజన్లలో వైస్సార్సీపీ అభ్యర్థులే గెలుపొందారు. నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో మొత్తం 20 స్థానాలకు గానూ వైఎస్సార్సీపీ 18 , టీడీపీ 2 వార్డుల్లో విజయం సాధించింది.
గుంటూరు జిల్లాలోని గురజాల నగర పంచాయతీలో 20 వార్డులకు గానూ.. 16వైఎస్సార్సీపీ, 3 టీడీపీ గెలవగా.. ఒక్క స్థానంలో జనసేన గెలిచింది. దాచేపల్లి నగర పంచాయతీలో 20 వార్డులకు ఎన్నికలు జరగగా.. 11 స్థానాల్లో వైఎస్సార్సీపీ, 7 వార్డుల్లో టీడీపీ విజయం సాధించాయి. జననేన 1, స్వతంత్ర అభ్యర్థి ఒకరు వార్డులో గెలిచారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడు నగర పంచాయతీని వైఎస్సార్సీపీ గెలుచుకుంది. 20 వార్డులకుగానూ వైఎస్సార్సీపీ 12, టీడీపీ 4 వార్డుల్లో విజయం సాధించింది. జనసేన 3 స్థానాల్లో గెలవగా.. ఒక్క స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.