ఢిల్లీ ,జూలై : గుర్గావ్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు కొన సాగిస్తున్న ఇండియా వీడియో ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ సిమ్సిమ్ ను చేజిక్కించుకోనున్నది సోషల్ మీడియా దిగ్గజం యుబ్యూబ్. కొత్త కస్టమర్లకు మరింత చేరువ కావడానికి ఇలాంటి చిన్నతరహా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను మరింత ప్రోత్సహించే క్రమంలో ఈ డీల్ కుదిరినట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం తొలిదశలో 10 బిలియన్ల మేర పెట్టుబడులు పెట్టడానికి యుట్యూబ్ సిద్ధమైంది.
లోకల్ ప్రొడక్ట్కు మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించడానికి ఏర్పాటు చేసిన చిన్నతరహా ఈ-కామర్స్ వీడియో ప్లాట్ఫామ్ సిమ్సిమ్ యాప్ ఇది. అందులో పోస్ట్ అయ్యే వీడియోల ద్వారా స్థానిక ఉత్పత్తులను ఆన్లైన్ ద్వారా వినియోగదారులకు పరిచయం చేస్తుంటుంది. హిందీ, తమిళం, బెంగాలీ భాషల్లో ఈ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ స్టార్టప్ రెండేండ్ల క్రితం ఏర్పాటైంది. అమిత్ బగారియా, కునాల్ సూరి, సౌరభ్ వశిష్ఠ దీన్ని నెలకొల్పారు. దీన్ని కొనుగోలు చేయడానికి యుట్యూబ్ ఆసక్తి చూపింది. యుట్యూబ్ చేతుల్లోకి వెళ్లిన తరువాత కూడా సిమ్సిమ్కు చెందిన యాప్ ఇండిపెండెంట్గానే పనిచేస్తుందని యుట్యూబ్ యాజమాన్యం గూగుల్ వెల్లడించింది.