పాట్నా, మార్చి 27: బీహార్ సీఎం నితీశ్కుమార్పై ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు. భక్తియార్పూర్లో ఆదివారం ఈ ఘటన జరిగింది. స్వాతంత్య్ర సమరయోధుడు శిల్భధ్ర యాజీ నివాళి కార్యక్రమానికి హాజరైన సమయంలో యువకుడు సెక్యూరిటీని దాటి మరీ దాడి చేశాడు. సిబ్బంది వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడ్ని 25 ఏండ్ల శంకర్గా గుర్తించిన పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. మరోవైపు మంత్రి ముఖేష్ సహానీని తప్పిస్తూ నితీశ్ గవర్నర్కు సిఫార్సు చేశారు. సహానీ అధ్యక్షుడిగా ఉన్న వికాస్షీల్ ఇన్సాన్ పార్టీ ఎన్డీఏలో భాగం కాదని బీజేపీ చేసిన సూచనతో నితీశ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.