హైదరాబాద్ : ఫలక్నూమాలో విషాదం నెలకొంది. ఓ 20 ఏండ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మహ్మద్ ఆరిఫ్ అనే వ్యక్తి తన కుమారుడు సల్మాన్తో కలిసి ఎన్ఎస్ కుంటలో గత కొన్నేండ్ల నుంచి అద్దె గదిలో ఉంటున్నాడు. వీరిద్దరూ స్కూల్ బ్యాగులో తయారు చేసే కంపెనీలో పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు.
అయితే బుధవారం ఉదయం పని నిమిత్తం ఆరిఫ్ గుల్బార్గా వెళ్లాడు. రాత్రి సమయంలో సల్మాన్కు ఆరిఫ్ ఫోన్ చేయగా, అతను స్పందించలేదు. దీంతో ఆందోళనకు గురైన ఆరిఫ్.. బంధువు జాఫర్కు సమాచారం అందించాడు. జాఫర్ హుటాహుటిన సల్మాన్ నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లాడు. సల్మాన్ ఫ్యాన్కు ఉరేసుకున్నట్లు జాఫర్ గుర్తించి, పోలీసులకు సమాచారం అందించాడు.
పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్బాడీని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.