లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇవాళ గోరఖ్పూర్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో సీఎం యోగి తన నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. పలువురు బీజేపీ నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 3, 7వ తేదీల్లో యూపీలో ఎన్నికలు జరగనున్నాయి. మాఫియా పాలన నుంచి యూపీని యోగి విముక్తి చేశారని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. 25 ఏళ్ల తర్వాత మళ్లీ యూపీలో చట్టబద్దమైన పాలన జరుగుతోందన్నారు.